తండ్రి ని వదలనంటున్న చరణ్

Update: 2018-11-14 03:38 GMT

అల్లు అరవింద్ బ్యానర్ లో అంటే గీత ఆర్ట్స్ లో మెగాస్టార్ చిరంజీవి ఎన్నో సినిమాలు హీరోగా చేశాడు. అందులో చాలావరకు సూపర్ హిట్ అయ్యాయి. మళ్లీ చిరంజీవి రీఎంట్రీ ఖైదీ నెంబర్ 150 సినిమా తన కొడుకు బ్యానర్ లో అంటే కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ లో చేశాడు. ఇప్పుడు 'సైరా' కూడా అందులోనే చేస్తున్నాడు చిరు. చిరంజీవి రీఎంట్రీ ఇచ్చిన తరువాత చాలామంది బడా నిర్మాతలు చిరు డేట్స్ కోసం వెయిట్ చేశారు. కానీ ఆ ఛాన్స్ ఎవరికి ఇవ్వలేదు చరణ్.

తన తండ్రి తన బ్యానర్ లో సినిమాలు చేయాలనీ కంకణం కట్టుకుని కూర్చుకున్నాడు. అందుకే మైత్రి మూవీస్ వారు కొరటాల - చిరంజీవి సినిమా కోసం ట్రై చేసిన ఆ అవకాశం ఇవ్వలేదు చరణ్. అయితే మొదట ఈచిత్రాన్ని అల్లు అరవింద్ నిర్మిస్తాడు అనుకున్నారు. కానీ అది ఏమి వర్క్ అవుట్ అయినట్టు లేదు. 153వ సినిమాను కూడా చరణే నిర్మించనున్నాడు.

ఇది కూడా భారీ బడ్జెట్ మూవీ కావడం వలన, కొరటాల సన్నిహితుడు సహ నిర్మాతగా ఉంటాడని చెప్పుకుంటున్నారు. సో ఆలా తండ్రి చేసే సినిమాలు అన్ని బయిటికి పోకుండా తానే నిర్మించుకుంటున్నాడు చరణ్. ప్రస్తుతం 'సైరా' చిత్రం లో బిజీగా ఉన్న చిరు సంక్రాంతికి తరువాత రెగ్యులర్ షూట్ స్టార్ట్ కానుంది. త్వరలోనే ఆఫిషల్ గా అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.

Similar News