బాలీవుడ్ స్టార్స్ ని కాపాడుతున్నాడా?

సాహో కి కనీసం యావరేజ్ టాక్ పడినా.. నిర్మాతలు, బయ్యర్లు సేఫ్ అయ్యేవారు. అడ్డదిడ్డం గా పెట్టుబడి పెట్టి.. సినిమాలో కంటెంట్ లేకుండా. ఎంత ప్రమోషన్ చేసినా [more]

Update: 2019-09-06 06:58 GMT

సాహో కి కనీసం యావరేజ్ టాక్ పడినా.. నిర్మాతలు, బయ్యర్లు సేఫ్ అయ్యేవారు. అడ్డదిడ్డం గా పెట్టుబడి పెట్టి.. సినిమాలో కంటెంట్ లేకుండా. ఎంత ప్రమోషన్ చేసినా ఉపయోగం ఉండదు అనేది సాహో తో తేలిపోయింది. ప్రభాస్ క్రేజ్ తో వన్ మ్యాన్ ఆర్మీలా బాలీవుడ్ నటులను వెంటేసుకుని సాహో ని ప్రమోట్ చేసినా.. ప్లాప్ టాక్ తో ఉపయోగం లేకుండా పోయింది. అయితే సాహో దెబ్బకి సై రా ని కొన్న బాలీవుడ్ బయ్యర్లు పడుతున్న టెన్షన్ ని సై రా నిర్మాత రామ్ చరణ్ కనిపెట్టినట్టుగా ఉన్నాడు. అందుకే రామ్ చరణ్ కొత్త ఎత్తుగడ వేసినట్లుగా తెలుస్తుంది.అదేమిటంటే సై రా సినిమా వచ్చేనెల 2 న విడుదల కాబోతుంది. అందుకే సై రా ప్రమోషన్స్ ని చాలా ప్లాన్డ్ గా చరణ్ చేపట్టబోతున్నాడట.

హిందీలో సైరా…

అతి పెద్ద మార్కెట్ అయిన హిందీలో సై రా ని బలంగా చూపించి క్రేజ్ సంపాదించాలంటే భారీ ప్రమోషన్స్ అవసరం. ఎలాగూ అమితాబ్ సై రా ప్రమోషన్స్ కి వస్తారు. ఇక సై రా స్పెషల్ ప్రమోషన్స్ కోసం రామ్ చరణ్ తనకు సన్నిహితులైన అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరోలతో సై రా సినిమాపై పాజిటివ్ మాటలు నాలుగు మాట్లాడించాలని ప్లాన్ చేస్తున్నాడట. మాములుగా తెలుగు సినిమాలంటే చిన్న చూపు చూసే అమీర్, సల్మాన్ లు చరణ్ చెబితే ఒప్పేసుకుని సై రాని ఏ మాత్రం ప్రమోట్ చేస్తారో చూడాలి.

Tags:    

Similar News