మరోసారి సూపర్ హిట్ కాంబో?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు టాప్ హీరోయిన్ సమంతా కలిసి ఇంతకు ముందు రంగస్థలం సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ కొట్టారు. ఆ సినిమాలో [more]

Update: 2020-02-11 11:29 GMT

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు టాప్ హీరోయిన్ సమంతా కలిసి ఇంతకు ముందు రంగస్థలం సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ కొట్టారు. ఆ సినిమాలో రామ్ చరణ్, సమంతల నటన వాళ్ళ కెరీర్ లోనే బెస్ట్ అన్నట్టుగా ఉంది. అయితే ఆ సూపర్ హిట్ కాంబో మరోసారి రిపీట్ కాబోతుంది అనే టాక్ వినబడుతుంది. అది కూడా మెగాస్టార్ – కొరటాల మూవీ లో రామ్ చరణ్ ఓ గెస్ట్ రోల్ చెయ్యబోతున్నాడు. అయితే ఆ రోల్ కూడా అలాంటి ఇలాంటి రోల్ కాదు..చరణ్ యంగ్ చిరు గా నక్సలైట్ పాత్రలో కనిపించబోతున్నాడనే న్యూస్ నడుస్తుంది.

ఆచార్య (తాత్కాలిక టైటిల్) లో మెగా పవర్ స్టార్ 30 నిమిషాల అతిధి పాత్రలో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. మరి చరణ్ యంగ్ చిరుగా నక్సలైట్ పాత్రధారి చరణ్ సరసన హీరోయిన్ గా సమంత నటించే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఈ అతిధి పాత్ర కోసం చరణ్ సరసన కియారా అద్వానీ మరియు మరో ఇద్దరు హీరోయిన్లను కూడా పరిశీలించారని.. అయితే ఈ ప్రాజెక్ట్ కోసం సమంత పేరు ఫైనల్ అవుతుందా? లేదా క్లారిటీ లేదు. ఇక చిరు సరసన ఈ సినిమా కోసం త్రిష ని కొరటాల ఫైనల్ చేసాడు. అయితే అధికారికంగా ధ్రువీకరించలేదు. ఇక ఐటెం సాంగ్ కోసం మాత్రం రెజీనాని తీసుకోవడం.. ఇప్పటికే ఆమెపై ఆ స్పెషల్ సాంగ్ ని తియ్యడం కూడా జరిగాయి.

Tags:    

Similar News