రకుల్ నువ్వు గ్రేటమ్మా?

ప్రస్తుతం కరోనా కారణంగా నిర్మాతలంతా లాస్ అయ్యారు. అందుకే హీరోలు, హీరోయిన్స్, డైరెక్టర్స్ అందరూ పారితోషికాలు తగ్గించాలి, బడ్జెట్ కొత్త పెట్టాలి అనే ప్రతిపాదన వచ్చింది. అందులో [more]

Update: 2020-09-11 06:08 GMT

ప్రస్తుతం కరోనా కారణంగా నిర్మాతలంతా లాస్ అయ్యారు. అందుకే హీరోలు, హీరోయిన్స్, డైరెక్టర్స్ అందరూ పారితోషికాలు తగ్గించాలి, బడ్జెట్ కొత్త పెట్టాలి అనే ప్రతిపాదన వచ్చింది. అందులో ఎవరు ఎంతవరకు అమలు చేస్తున్నారో కానీ ఆ మధ్యన పరశురామ్, కీర్తి సురేష్ లు తమ పారితోషికాలు తగ్గించారని టాక్ నడిచింది. అయితే తాజాగా రకుల్ కూడా తన పారితోషికంలో సగానికి సగం కొత్త పెట్టుకుంది. పాపం అవకాశాలు లేవు.. అయినా వచ్చిన అవకాశాలకు భారీ పారితోషకం డిమాండ్ చేస్తుంది అని ఒకప్పుడు రకుల్ ని ఆడిపోసుకున్నారు.

కానీ రకుల్ ప్రీత్ ఇప్పుడు తన పారితోషికంలో కోత పెట్టుకుంది. అది కూడా క్రిష్ – వైష్ణవ తేజ్ కాంబోలో తెరకెక్కనున్న లో బడ్జెట్ మూవీకి. చిన్న సినిమా కావడంతో.. ఈ సినిమాకి తన పారితోషికంలో సగం ఇస్తే చాలని రకుల్ నిర్మాతలకు చెప్పిందట.. గతంలో ఒక్కో సినిమాకి కోటిన్నర నుండి రెండు కోట్లు పుచ్చుకున్న రకుల్ క్రిష్ సినిమా కోసం కేవలం 50 లక్షలు మాత్రమే అందుకోబోతుందట. మరి ఒకప్పుడు కోటికి దిగని రకుల్ లో ఇంత మార్పా అని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఇక క్రిష్ దర్శకత్వంలో గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తాజాగా వికారాబాద్ అడవుల్లోని మొదలయ్యింది. కేవలం 40 రోజుల సింగిల్ షెడ్యూల్ లో ఈ మూవీ చిత్రీకరణని క్రిష్ పూర్తి చేయబోతున్నాడట.

Tags:    

Similar News