రకుల్ నచ్చడం లేదా..?

అక్కినేని అఖిల్, బెల్లంకొండ శ్రీనివాస్ ఇద్దరి పరిస్థితా ఒక్కటే. ఇద్దరూ తమ కెరీర్ ని ఎప్పుడో స్టార్ట్ చేసారు కానీ చెప్పుకోవడానికి ఒక్క హిట్ కూడా లేదు. [more]

Update: 2019-02-20 08:02 GMT

అక్కినేని అఖిల్, బెల్లంకొండ శ్రీనివాస్ ఇద్దరి పరిస్థితా ఒక్కటే. ఇద్దరూ తమ కెరీర్ ని ఎప్పుడో స్టార్ట్ చేసారు కానీ చెప్పుకోవడానికి ఒక్క హిట్ కూడా లేదు. అందుకే బెల్లంకొండ ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఓ తమిళ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. తమిళంలో సూపర్ హిట్ అయిన “రట్ససన్” అనే థ్రిల్లర్ సినిమాను తెలుగు రీమేక్ చేస్తున్నాడు శ్రీనివాస్. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. రమేష్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో మొదట హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ అనుకున్నారు టీం.

రాశీ ఖన్నాను సెలెక్ట్ చేశారు…

అయితే ఆల్రెడీ వీరి కాంబినేషన్ లో “జయ జానకి నాయక” వచ్చింది కాబట్టి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు కొత్తగా హీరోయిన్ గా రాశీ ఖన్నా పేరు అనుకుంటున్నారు. వీరి కాంబినేషన్ అయితే ఫ్రెష్ గా ఉంటుందని భావించారు దర్శకనిర్మాతలు. అందుకే ఆమెను ఓకే చేసినట్టు టాక్. తమిళ్ లో అమలా పాల్ చేసిన పాత్రని తెలుగులో రాశీ ఖన్నా కరెక్ట్ గా సెట్ అవుతుందని భావించి ఆమెను తీసుకుంటున్నారు. త్వరలోనే అధికార ప్రకటన రానుంది.

Tags:    

Similar News