ఆ సిపిమాలో సెకండ్ హీరోయిన్ గానా..?

టాలీవుడ్ లో చిన్నా పెద్ద స్టార్ హీరోలందరినీ చుట్టేసిన రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు సీనియర్ హీరోలతోనూ సినిమాలు చేస్తుంది. కెరీర్ కాస్త ఇబ్బందుల్లో పడేసరికి రకుల్ [more]

Update: 2019-05-01 06:26 GMT

టాలీవుడ్ లో చిన్నా పెద్ద స్టార్ హీరోలందరినీ చుట్టేసిన రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు సీనియర్ హీరోలతోనూ సినిమాలు చేస్తుంది. కెరీర్ కాస్త ఇబ్బందుల్లో పడేసరికి రకుల్ సీనియర్స్ తోనూ సినిమాలు ఒప్పేసుకుంటుంది. మహేష్ తో స్పైడర్ సినిమా తర్వాత టాలీవుడ్ కి దూరమైన ఈ భామ కోలీవుడ్ లోనూ ఫ్లాప్స్ కొట్టింది. ఇక బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ ఇక్కడ సౌత్ ని ఓ చూపు చూసుకుంటుంది. తాజాగా రకుల్ ప్రీత్ సెకండ్ హీరోయిన్ కి పడిపోయిదననే న్యూస్ ఆ మధ్యన కోలీవుడ్ లో వినబడితే ఇప్పుడు టాలీవుడ్ లో మొదలైంది. మహేష్ తో స్పైడర్ లో నటించి క్రేజ్ కోల్పోయిన రకుల్ ప్రీత్ ఇప్పుడు మరోసారి మహేష్ తో సెకండ్ హీరోయిన్ గా నటించబోతుంది.

మొదటి హీరోయిన్ గా రష్మిక

అది కూడా మహేష్ – అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న మహేష్ 26వ సినిమాలో. ఈ సినిమాలో మొదటి హీరోయిన్ రష్మిక మందన్నని ఎప్పుడో ఎంపిక చేసారని అన్నారు. ఇక సెకండ్ హీరోయిన్ కోసం వెతుకుతున్నారనే న్యూస్ వినబడింది. తాజాగా రకుల్ ప్రీత్ ని మహేష్ 26వ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ సినిమాకు ‘సరిలేరు నీకెవ్వరూ’ అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉండగా.. ఇందులో బండ్ల గణేష్ కమెడియన్ గా రీ ఎంట్రీ ఇస్తుంటే… లేడి సూపర్ స్టార్ విజయశాంతి కూడా కీలక పాత్రలో నటిస్తుంది. ఇక రమ్యకృష్ణ కూడా ఈ సినిమాలో మరో కీ రోల్ ప్లే చేస్తుందనే న్యూస్ నడుస్తుంది.

Tags:    

Similar News