రకుల్ కల నెరవేరింది

కన్నడలో తన సినీ రంగ ప్రవేశం చేసి అటుపై టాలీవుడ్ వైపు అడుగులు వేసింది పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. తన మాతృ బాషా పంజాబీ [more]

Update: 2019-05-30 09:08 GMT

కన్నడలో తన సినీ రంగ ప్రవేశం చేసి అటుపై టాలీవుడ్ వైపు అడుగులు వేసింది పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. తన మాతృ బాషా పంజాబీ అయినా బాలీవుడ్ లో సినిమాలు చేయకుండా సౌత్ సినిమాలపై ఫోకస్ పెట్టింది. రచ్చ గెలిచి ఇంట గెలవడం అన్నది రకుల్ సిద్ధాంతం. అందుకే సౌత్ లో సక్సెస్ అయ్యి బాలీవుడ్ వైపు అడుగులు వేసింది.

తెలుగులో ఈమె 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' లాంటి చిన్న సినిమాతో పెద్ద హిట్టు కొట్టింది. ఆ తరువాత నుండి ఆమె తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. స్టార్ హీరోస్ అందరితో నటించే ఛాన్స్ కొట్టేసిన రకుల్ ప్రస్తుతం సౌత్ లోనే అగ్ర కథానాయికల్లో ఒక భామగా పాపులారిటీ దక్కించుకుంది. అయితే ఈ మధ్య కాలం ఆమెకు సరిగా అవకాశాలు రావడంలేదు. దాంతో ఆమె ముంబై పరిశ్రమపై ఆశ చావక అజయ్ దేవగన్ లాంటి సీనియర్ స్టార్ సరసన 'దే దే ప్యార్ దే' అనే చిత్రంలో నటించింది.

ఈ చిత్రం 10రోజుల్లో 75కోట్లు.. 18రోజుల్లో 89కోట్లు వసూలు చేసింది. ఓవర్సీస్ కలుపుకుని 100కోట్ల క్లబ్ లో అడుగుపెట్టింది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ రకుల్ మాట్లాడుతూ….'దేదే ప్యార్ దే'తో హిట్ కొట్టాను హమ్మయ్య! అంటూ ఆనందం వ్యక్తం చేసింది. తన నటించిన మొదటి రెండు సినిమాలు ఫ్లాపులయ్యాయి. సో అలా రకుల్ కల నెరవేరింది.

Tags:    

Similar News