రకుల్ హైదరాబాద్ వచ్చింది అందుకా!!

రకుల్ ప్రీత్ కరోనా లాక్ డౌన్ పెట్టడంతో ముంబై లో తన తమ్ముడు అమన్ తో ఇంట్లోనే ఉండిపోయింది. మూడు నెలల పటు ఇంట్లోనే వండుకుని తిని, [more]

Update: 2020-07-16 03:47 GMT

రకుల్ ప్రీత్ కరోనా లాక్ డౌన్ పెట్టడంతో ముంబై లో తన తమ్ముడు అమన్ తో ఇంట్లోనే ఉండిపోయింది. మూడు నెలల పటు ఇంట్లోనే వండుకుని తిని, తమ్ముడితో ఆటలాడుకుంటూ ఎంజాయ్ చేసిన రకుల్ ప్రీత్ ఫ్లైట్స్ తిరగగానే ముందుగా తల్లితండ్రులు దగ్గరికి.. ఢిల్లీకి చెక్కేసింది. ఒంటినిండుగా బట్టలు వేసుకుని ముంబై ఎయిర్ పోర్ట్ లో ప్రత్యక్షమయిన రకుల్ ప్రీత్ ఢిల్లీకి వెళ్లి పేరెంట్స్ తో టైం స్పెండ్ చేసింది. అయితే ముంబై లో రకుల్ నటించాల్సిన సినిమా షూటింగ్స్ ఇంకా సెట్స్ మీదకి వెళ్ళడానికి టైం పట్టేలా ఉండడం ఢిల్లీ, ముంబై లలో కరోనా కేసులు ఎక్కువగా ఉండడంతో ఇప్పుడు రకుల్ ప్రీత్ సేఫ్ అని హైదరాబాద్ ఇంటికి వచ్చినట్టుగా చెబుతున్నారు.

అది కూడా బై రోడ్ అంట. రకుల్ ప్రీత్ కార్ లో ఢిల్లీ నుండి సేఫ్ గా హైదరాబాద్ కి వచ్చింది అని.. కరోనా ఎక్కువగా ఉండడంతో ఫ్లైట్స్ కూడా సేఫ్ కాదని భావించిన రకుల్ ఇలా కార్ లోనే హైదరాబాద్ చేరుకుందని అంటున్నారు. ఇప్పటికే ముంబైలో దిగ్గజ నటులంతా కరోనా పాజిటివ్ తో హాస్పిటల్ లో చేరడంతో ఇప్పుడు అందరూ సేఫ్టీ ని వెతుక్కుంటున్నారు. ఇక చెన్నై లో కరోనా భీభత్సంగా ఉండడంతో శృతి హాసన్ ఎప్పుడో హైదేరాబద్ కి వచ్చేసింది. షూటింగ్స్ లేకపోయినా తారలంతా హైదరాబాద్ కి వచ్చేస్తున్నారు. తాజాగా రకుల్ కూడా ఢిల్లీ, ముంబై లలో కరోనా ఎక్కువగా ఉండడంతో హైదరాబాద్ కి వచ్చేసినట్టుగా ఫిలింనగర్ లో గుసగుసలు వినబడుతున్నాయి.

Tags:    

Similar News