చెరువు మీద అలిగితే… నష్టం నీకే పాపా?

ఆదివారం జరిగిన సినీ మహోత్సవం ఈవెంట్ కి అతిరథ మహారధులు హాజరయ్యారు. చిరంజీవి, మహేష్ లాంటి స్టార్ హీరోలొస్తే… లావణ్య త్రిపాఠి, పూజ హెగ్డే, రాశి ఖన్నా, రకుల్ [more]

Update: 2019-09-10 06:34 GMT

ఆదివారం జరిగిన సినీ మహోత్సవం ఈవెంట్ కి అతిరథ మహారధులు హాజరయ్యారు. చిరంజీవి, మహేష్ లాంటి స్టార్ హీరోలొస్తే… లావణ్య త్రిపాఠి, పూజ హెగ్డే, రాశి ఖన్నా, రకుల్ ప్రీత్ లాంటి హాట్ హీరోయిన్స్ కూడా హాజరయ్యారు. ఇక హీరోయిన్స్ కి ఏదైనా ఓ భారీ స్టేజ్ దొరికితే చాలు తమ డాన్స్ పెరఫార్మెన్సెస్ తో ఆకట్టుకుని ఛాన్సులు కొట్టేయాలని చూస్తారు. ఇక ఆ సినీమహోత్సవం ఈవెంట్ లోనూ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ తో కలిసి రాశి ఖన్నా పాటతో యూత్ ని ఉర్రుతలూగిస్తే.. పూజ హెగ్డే, అనసూయ, రుక్సార్ లాంటి హీరోయిన్ డాన్స్ తో అదరగొట్టేసాడు.

రకుల్ ఎందుకు అలిగిందో తెలుసా….?

ప్రస్తుతం అవకాశాలు లేని రకుల్ ఎప్పటిలాగే ఈ ఈవెంట్ కోసం ఓ డాన్స్ పెరఫార్మెన్సు కోసం రిహార్సల్స్ చేసి.. ఈవెంట్ లో పెరఫార్మెన్స్ ఇవ్వడానికి రెడీ అయ్యింది. కానీ రకుల్ కి ఆ ఛాన్స్ దక్కలేదు. అనసూయా, పూజ ల తర్వాత రకుల్ డాన్స్ చెయ్యాల్సి ఉండగా చిరు, మహేష్ లాంటి హీరోలు స్టేజ్ ఎక్కేసి స్పీచ్ ఇచ్చేయడంతో.. రకుల్ డాన్స్ ని క్యాన్సిల్ చేశారట. అయితే డాన్స్ చేయడంకోసం వేచి చూసిన రకుల్ ఆడాన్స్ క్యాన్సిల్ కావడంతో అసహనంగా అక్కడ నుంచి వెళ్లిపోయిందట. మరి ఏదోలే అని సరిపెట్టుకుని ఆ ఈవెంట్ అయ్యేవరకు ఉంటే బావుండేది. కానీ రకుల్ అలిగింది. అసలే అవకాశాలు లేని రకుల్ అలిగినా.. ఆమెకే నష్టమంటూ సోషల్ ఇండియాలో సెటైర్స్ పడుతున్నాయి.

 

Tags:    

Similar News