మరో వంద కోట్లు బడ్జెట్ పెరిగింది!

Update: 2018-06-22 04:51 GMT

సూపర్ స్టార్ రజిని కాంత్ - శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం రోబో 2.0 సినిమా. ఇప్పటికే అరడజిన్ సార్లు ఈ సినిమా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఏడాది నుండి గ్రాఫిక్స్ పనులు జరుగుతూనే ఉన్నాయి. ముంబైతో పాటు అమెరికాలో ఈ సినిమాకు సంబందించిన గ్రాఫిక్స్ పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా ఖర్చు 400 కోట్ల పైన అయింది.

గ్రాఫిక్స్ ఎక్కువగా ఉండటంతో అంత బడ్జెట్ అవుతుందని సమాచారం. సరే అని అంత ఖర్చు పెట్టిన గ్రాఫిక్స్ ఓ కొలిక్కి వచ్చేటట్టు కనిపించడం లేదంట. అందుకే మరో వంద కోట్లు అయితే తప్ప గ్రాఫిక్స్ పనులు పూర్తీ కావట. ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ కూడా అదే పనుల్లో బిజీగా మారాడు. రజిని కాంత్ లేటెస్ట్ మూవీ 'కాలా' డిజాస్టర్ కావడంతో ఈ సినిమాపై బాగా ఫోకస్ పెట్టాడు శంకర్.

అవుట్ ఫుట్ ఒక రేంజ్ లో వచ్చేటట్టు చూసుకుంటున్నాడు. ఇక ఈ సినిమాలో అమీ జాక్సన్ హీరోయిన్ గా.. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ విలన్ గా నటిస్తున్నాడు. మరి ఈ రేంజ్ లో బడ్జెట్ అయితే పెరుగుతుంది కానీ సినిమా వసూళ్లు అందుకుంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావాలని ట్రై చేస్తున్నాడు శంకర్.

Similar News