రాజ‌శేఖ‌ర్ సరసన ఆ ఇద్దరు ఎవరో తెలుసా..?

Update: 2018-10-30 07:36 GMT

గత ఏడాది 'పి.ఎస్‌.వి. గ‌రుడ‌వేగ' చిత్రంతో సూపర్ హిట్ అందుకుని ఫామ్ లోకి వచ్చిన యాంగ్రీ యంగ్ మ్యాన్ డా.రాజ‌శేఖ‌ర్ ప్రస్తుతం 'క‌ల్కి' అనే సినిమాలో నటిస్తున్నారు. 'గ‌రుడ‌వేగ' మూవీ తరువాత కొంచం గ్యాప్ తీసుకుని 'అ!' వంటి విల‌క్షణ‌మైన చిత్రాన్ని తెర‌కెక్కించిన యువ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ డైరెక్షన్ లో 'క‌ల్కి' సినిమాలో చేస్తున్నాడు రాజ‌శేఖ‌ర్. ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్.. శివానీ రాజ‌శేఖ‌ర్‌, శివాత్మిక రాజ‌శేఖ‌ర్ లు ఈ సినిమాకి నిర్మాతలుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. 1980 నాటి క‌థ‌, పీరియాడిక్ నేప‌థ్యం డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌ తో రూపొందుతున్న ఈ సినిమాలో నందిత శ్వేతా ఓ కీల‌క పాత్ర‌లో నటిస్తుంద‌ని కొన్ని రోజులు కిందట వార్తలు వచ్చాయి.

ఇద్దరు హీరోయిన్లతో...

అయితే తాజా సమాచారం ప్రకారం ఇందులో రాజ‌శేఖ‌ర్ స‌ర‌స‌న మరో ఇద్ద‌రు ముద్దుగుమ్మ‌లు నటించనున్నారట. ఆల్రెడీ వారిని ఓకే చేసినట్టు సమాచారం. ఒక్కరు 'బాహుబ‌లి-ది బిగినింగ్‌' లో స్పెష‌ల్ సాంగ్‌లో అందాలు ఆర‌బోసిన స్కార్‌లెట్ విల్స‌న్. ఇంకొకరు హాట్ బ్యూటీ అదా శ‌ర్మ. వీరిద్దరూ దాదాపు కంఫర్మ్ అయిపోయినట్టే అని టాక్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. 'అ!' చిత్రంతో ఆకట్టుకున్న ప్రశాంత్ ఈ సినిమాతో ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి.

Similar News