ఇన్ డైరెక్ట్ గా చెప్పిన రాజశేఖర్

Update: 2018-06-29 06:18 GMT

గత ఏడాది 'గరుడ వేగ' సినిమాతో బౌన్స్ బ్యాక్ అయ్యాడు సీనియర్ హీరో రాజశేఖర్. ప్రేక్షకులు కూడా చాలా ఏళ్ళ తర్వాత రాజశేఖర్ ని చూడటానికి థియేటర్స్ కి వచ్చారు. దీంతో అంతా ఇక రాజశేఖర్ వరసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయ్యిపోతాడు అని అనుకున్నారు. కానీ ఆ సినిమా రిలీజ్ అయ్యి ఎనిమిది నెలలు కావొస్తుంది. అయినా రాజశేఖర్ తన కొత్త సినిమా అనౌన్స్ చేయలేదు.

ట్వీట్ లో దర్శకుడి...

అయితే ఎట్టకేలకు తన తర్వాతి సినిమాపై క్లారిటీ ఇచ్చాడు రాజశేఖర్. కాకపోతే డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా చెప్పాడు. తన తర్వాతి సినిమా AWEsomeగా ఉండబోతోందంటూ ఆయన ఈ రోజు ఒక ట్వీట్ చేశాడు. అంతే 'AWE' సినిమా తీసిన యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో తన నెక్స్ట్ సినిమా వుండబోతున్నట్టు ఇండైరెక్ట్ గా చెప్పాడు. కొన్ని నెలలు నుండి ప్రచారం జరుగుతున్నట్లే ‘అ!’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయిన ప్రశాంత్ వర్మతోనే రాజశేఖర్ పని చేయబోతున్నట్లు స్పష్టమైంది.

మరి నిర్మాత ఎవరు..?

అయితే ఈ సినిమాకు ఎవరు నిర్మాత అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం డైరెక్టర్ ప్రశాంత్ వర్మ 'క్వీన్' రీమేక్‌ను డైరెక్ట్ చేసే పనిలో ఉన్నాడు. ఆ పని పూర్తి అవ్వగానే రాజశేఖర్ సినిమాను మొదలుపెట్టడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇంకా ఈ సినిమా గురించి ఆఫిషల్ అనౌన్సిమెంట్ రాలేదు. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.

Similar News