రాజమౌళి సినిమాపై సంచలన వార్తలు!!

Update: 2018-04-11 11:37 GMT

రాజమౌళి గారు బాహుబలి సినిమా తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో సినిమాను తియ్యబోతున్నాని ఒకే ఒక్క పిక్ ద్వారా ప్రకటించాడు. ఆదిపట్టుకుని అందరూ ఎవరికి తోచిన విధంగా వారు కథలు అల్లేశారు. ఇక దానయ్య కూడా ఆఫీసియల్ గా #RRR అంటూ ఒక మోషన్ పోస్టర్ ద్వారా రాజమౌళి, రామ్ చరణ్, రామారావు అంటూ ప్రకటించాడు. అంతేకాని రాజమౌళి మాత్రం ఈ మల్టీస్టారర్ విషయమై ఎక్కడా పెదవి విప్పలేదు. కానీ చరణ్, ఎన్టీఆర్ అయితే మాకేం తెలియదు అంతా రాజమౌళినే అంటున్నారు.

అయితే ఈ సినిమాపై కొన్ని షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు దర్శనమిస్తున్నాయి. అందులో మచ్చుకు కొన్ని. రాజమౌళి తియ్యబోయే ఈ బడా మల్టీస్టారర్ ని భారీ అంటే అతి భారీ గా 250 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుంది. అయితే అసలే భారీ బడ్జెట్ అంటుంటే... అందులో రాజమౌళి, రామ్ చరణ్, రామారావు లకే చాలా మొత్తం పారితోషకాల కింద పోతుందట. అయితే ఆ ముగ్గురు పారితోషకాలే ఈ 250 కోట్లలో 75 కోట్లు ఉండబోతున్నట్టుగా వీర లెవల్లో సోషల్ మీడియా లో వార్తలు వైరల్ అవుతున్నాయి.

అలాగే రాజమౌళి ఎలాంటి కథతో సినిమాని డిజైన్ చేస్తున్నాడో అనేది కూడా ఎవ్వరికి క్లారిటీ లేదు... కానీ ఇప్పుడు రెండు మూడు కథలు మాత్రం ప్రచారం లో ఉన్నాయి. స్వాతంత్ర్యానికి ముందు కథ అని కొందరు చెబుతున్నారు. 1980 నేపథ్యంలో సాగే కథ అని మరి కొందరు చెబుతున్నారు. అలాగే ఈ మల్టీస్టారర్ లో ఎన్టీఆర్ మల్ల యోధుడుగాను, రామ్ చరణ్ హార్స్ రైడర్ గాను కనిపించబోతున్నట్టుగా కూడా ప్రచారం జరుగుతుంది. అయితే ఇవన్నీ నిజమా కాదా అనేది మాత్రం రాజమౌళి స్పందనను బట్టి ఉంటుంది మరి.

Similar News