టైం ఫిక్స్ చేసిన జక్కన్న

Update: 2018-05-12 05:13 GMT

టాలీవుడ్ లో అంత వెయిట్ చేస్తున్న చిత్రం రాజమౌళి తెరకెక్కించే మల్టీ స్టార్రర్ కోసమే. మెగా ఫ్యామిలీ నుండి రామ్ చరణ్.. నందమూరి ఫ్యామిలీ నుండి ఎన్టీఆర్ ఈ సినిమాలో హీరోలుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పటినుండో జక్కన్న ఈ ప్రాజెక్ట్ పై చాలాకాలం పాటు కసరత్తు చేశారు. జక్కన్న ఈ మల్టీ స్టార్రర్ ఎనౌన్స్ చేసిన దగ్గర నుండి ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమా కోసం ఎంత బడ్జెట్ ను కేటాయించారు? ఎలాంటి టైటిల్ పెట్టనున్నారు? అనేది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించి ఓ టైటిల్ కూడా సోషల్ మీడియాలో హల చల్ చేస్తుంది. ఈ మూవీకి 'ఇద్దరూ ఇద్దరే' అనే టైటిల్ ను రాజమౌళి పరిశీలిస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు.

ఈ సినిమాలో చరణ్ అండ్ ఎన్టీఆర్ పాత్రలు సమానంగా ఉంటాయట. ఈ రెండు పాత్రలు కూడా పోటీపడుతూ సమాంతరంగా సాగుతాయి. అందుకే ఈ సినిమాకు ఆ టైటిల్ అనుకుంటున్నట్టు సమాచారం. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే. ఆగష్టు నెలలో నటీనటుల ఎంపికను మొదలెట్టి .. అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూటింగుకి వెళతారట.

Similar News