రాధేశ్యాం అలా ఉండబోతుందా?

ప్రభాస్ – పూజ హెగ్డే కాంబో లో దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న రాధేశ్యాం సినిమా పాన్ ఇండియా లెవల్లో భారీగా తెరకెక్కుతుంది. కరోనా కారణంగా వాయిదా పడిన [more]

Update: 2020-10-30 09:02 GMT

ప్రభాస్ – పూజ హెగ్డే కాంబో లో దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న రాధేశ్యాం సినిమా పాన్ ఇండియా లెవల్లో భారీగా తెరకెక్కుతుంది. కరోనా కారణంగా వాయిదా పడిన రాధేశ్యాం షూటింగ్ మళ్ళీ ఈమధ్యనే ఇటలీలో షూటింగ్ మొదలు పెట్టుకుంది. అయితే ఇటలీలో కరోనా కేసులు ఎక్కువగా ఉండడంతో.. అక్కడ షూటింగ్ ని త్వరగా ముగించుకుని ఇండియా వచ్చేయాలని రాధేశ్యాం టీం చూస్తుంది. మరి సోషల్ మీడియాలో రాధేశ్యాం సినిమా అలా ఉండబోతుంది…. ఇలా ఉండబోతుంది అంటూ రకరకాల కథలు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే.

తాజాగా రాధేశ్యాం లో డాక్టర్ గా నటిస్తున్న సచిన్ కెడ్కర్ రాధేశ్యాం కథ ఎలా ఉండబోతుందో రివీల్ చేసేసారు. ప్రభాస్ – పూజ హెగ్డే లుక్స్ ని బట్టి ఈ సినిమా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది అని తెలుస్తుంది. అయితే సచిన్ కెడ్కర్ ఈ సినిమా గురించి రివీల్ చేసి సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేశారు. రాధేశ్యాం కథ సైన్స్ కి మరియు జ్యోతిష్యానికి మద్య సాగుతుంది అని వివరించారు. ఈ చిత్ర కథ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అని ఈ సినిమాలో ప్రభాస్ భవిష్యత్ లో పూర్తి క్లారిటీ ఉండే పాత్రలో కనిపిస్తాడని.. అలాగే పూజ హెగ్డే పాత్ర కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది అని అంటున్నాడు. మరి సచిన్ కెడ్కర్ చెప్పిన దాని బట్టి రాధేశ్యాం సినిమా ఎలా ఉండబోతుందో అంటూ ప్రభాస్ ఫాన్స్ ఊహల్లోకి వెళ్లిపోయారు.

Tags:    

Similar News