ప్రభాస్ రెండు సినిమాల ముందు ఇది వెలవెల బోతుంది!!

ప్రభాస్ సాహో తర్వాత రాధాకృష్ణ కాంబోలో రాధేశ్యాం పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత నాగ్ అశ్విన్, ఓం రనౌత్ ల పాన్ ఇండియా [more]

Update: 2020-09-10 06:00 GMT

ప్రభాస్ సాహో తర్వాత రాధాకృష్ణ కాంబోలో రాధేశ్యాం పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత నాగ్ అశ్విన్, ఓం రనౌత్ ల పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్ లో నటించడానికి రెడీగా ఉన్నాడు. అయితే రాధేశ్యాం ఫస్ట్ లుక్ పై ఉన్న ఇంట్రెస్ట్ ఇప్పుడు ప్రేక్షకుల్లో సినిమా పై కనిపించడం లేదు. కారణం నాగ్ అశ్విన్ మూవీ, ఆదిపురుష్ సినిమాలు లైన్ లోకి రావడమే అంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో రాధే శ్యాం మీద ఎలాంటి హిప్ క్రియేట్ అవవడం లేదు. నాగ్ అశ్విన్ – ఆదిపురుష్ సినిమాలో ట్రేండింగ్ లో ఉంటున్నాయి. నాగ్ అశ్విన్ సినిమా న్యూస్ అయినా, లేదా ఆదిపురుష్ సినీమా న్యూస్ అయినా సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతున్నాయి.

ఇక దర్శకుడు రాధాకృష్ణ పరిస్థితిని గమనించి రాధే శ్యాం సినిమాలో ప్రభాస్ సూపర్ గా కనిపిస్తాడని, డార్లింగ్ తో పని చెయ్యడం నా కల అని ఏదేదో చెప్పినా జనాలకు ఎక్కడం లేదు. అదే ఆదిపురుష్ హీరోయిన్ పై గాసిప్ అయినా, ఆదిపురుష్ విలన్ సైఫ్ అలీ ఖాన్ మీది అయినా,  ప్రభాస్ రాముడి పాత్రపై రకరకాల న్యూస్ లు మాత్రం ట్రెండ్ అవుతున్నాయి. రాధేశ్యాం మూవీకి ఎలా క్రేజ్ తేవాలో ప్రభాస్ ఆలోచించాలి. లేదంటే సాహోకి పట్టిన గేట్ రాధేశ్యాం కి పడుతుంది అనే కామెంట్స్ సోషల్ మీడియాలో వినబడుతున్నాయి. మరి రాధేశ్యాం నాగ్ అశ్విన్ – ఓం రనౌత్ ల ఆదిపురుష్ ముందు వెల వెలబోతున్నట్టుగానే కనబడుతుంది.

Tags:    

Similar News