పుష్ప పట్టాలెక్కే లోపు.. ఇంకెన్ని వింటామో?

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబో మూవీ పట్టాలెక్కేందుకు సిద్ధంగా ఉంది. కానీ కరోనా మహమ్మారి.. అల్లు అర్జున్ కాళ్ళకి అడ్డం పడింది. త్రివిక్రమ్ తో అల [more]

Update: 2020-04-17 02:26 GMT

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబో మూవీ పట్టాలెక్కేందుకు సిద్ధంగా ఉంది. కానీ కరోనా మహమ్మారి.. అల్లు అర్జున్ కాళ్ళకి అడ్డం పడింది. త్రివిక్రమ్ తో అల వైకుంఠపురములో సినిమా చెయ్యడానికి ఓ ఏడాది గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్ కి ఈ సారి సుక్కు సినిమా కోసం అనుకోకుండా గ్యాప్ వచ్చేసింది. అయితే పుష్ప సినిమాని పాన్ ఇండియా మూవీ గా ఎనౌన్స్ చేసి షాకిచ్చిన సుక్కు – బన్నీ లు ఈ సినిమాపై అందరిలో అంచనాలు పెంచేశారు. అయితే ఈ సినిమాలో హీరో, హీరోయిన్స్ పేర్లు తప్ప మరే ఇతర పేర్లు బయట పెట్టలేదు. మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ ని తీసుకున్న సుక్కు బృందం… మిగతా టెక్నీకల్ మెంబెర్స్ విషయాలను రివీల్ చెయ్యలేదు. అయితే ఇప్పుడు ఈ సినిమా పట్టాలెక్కకముందే.. ఈ సినిమాపై రోజుకో న్యూస్ ప్రచారంలోకొసిస్తుంది.

ఈ సినిమాలో విజయ్ సేతుపతి కనిపిస్తాడని అన్నారు. తాజాగా విజయ్ సేతుపతి పుష్ప సిఎంమా నుండి బయటికెళ్లిపోయాడంటున్నారు. అలాగే దేవిశ్రీ – సుక్కు కాంబోలో హిట్ అయ్యేలా మాస్ సాంగ్స్ ఉన్నట్టుగానే పుష్ప లోను అదిరిపోయే మాస్ ఐటెం సాంగ్ ఉండబోతుంది అని.. ఆ సాంగ్ కోసమా బాలీవుడ్ హీరోయిన్ కియారా ని సంప్రదించగా ఆమె ఐటమ్స్ కి నో చెప్పడంతో.. బాలీవుడ్ అవకాశాలు లేకపోయినా సోషల్ మీడియాలో సెగలు రేపుతున్న ఊర్వశి రౌతేల్ల ని సంప్రదించినట్టుగా టాక్. మరి బాలీవుడ్ ఊర్వశి రౌతేల్ల అల్లు అర్జున్ పక్కన ఐటెం లో అందాలు ఆరబోస్తూ మాస్ స్టెప్స్ వేసింది అంటే… మాస్ ప్రేక్షకులకు మోత మోగిపోవాల్సిందే అంటుంటే… పుష్ప పట్టాలెక్కకముందే.. ఇన్ని న్యూస్ లు వింటుంటే.. పట్టాలెక్కేక ఇంకెన్ని వినాలో అంటున్నారు.

Tags:    

Similar News