మహేష్ కి ఝలక్ ఇచ్చాడే!!

మహేష్ బాబు దర్శకులను రిజెక్ట్ చేసే విషయంలో అందరి హీరోల కన్నా ముందుంటాడు. మొదటి నుండి ఓ దర్శకుడితో కనెక్ట్ అయ్యి.. సినిమా రేపో మాపో మొదలవుతుంది [more]

Update: 2020-06-25 02:30 GMT

మహేష్ బాబు దర్శకులను రిజెక్ట్ చేసే విషయంలో అందరి హీరోల కన్నా ముందుంటాడు. మొదటి నుండి ఓ దర్శకుడితో కనెక్ట్ అయ్యి.. సినిమా రేపో మాపో మొదలవుతుంది అనగానే ఆ దర్శకుడిని పక్కనబెట్టేస్తాడు. అలా పూరి జగన్నాధ్ విషయంలోనూ, సుకుమార్ విషయంలోనూ, తాజాగా వంశి పైడిపల్లి విషయంలోనూ జరిగింది. సుకుమార్, వంశి పైడిపల్లి లైట్ తీసుకున్నారు కానీ.. పూరి మాత్రం మహేష్ మీద పగబట్టినట్లుగానే కనబడుతున్నాడు. ఎప్పటికప్పుడు స్టార్ హీరోలను నమ్మకూడదని అంటుంటాడు. కానీ మహేష్ పూరి తో ఫ్యూచర్ లో సినిమా ఉంటుంది అంటాడు. పూరి జనగణమన అనే స్క్రిప్ట్ తో మహేష్ ని కలవడం మహేష్ ఓకె చెప్పడం తర్వాత పూరికి నో చెప్పడంతో.. పూరి – మహేష్ క్లాష్ మొదలయ్యింది.

అయితే తాజాగా మహేష్ కి భారీ ఝాలక్ ఇస్తూ పూరి జగన్నాధ్ తన జనగణమన స్క్రిప్ట్ తో పాన్ ఇండియా ఫిలిం చేయబోతున్నట్లుగా ప్రకటించాడు. విజయ్ దేవరకొండ తో సినిమాని ఛార్మి – పూరి – బాలీవుడ్ ఫిలిం మేకర్ కరణ్ జోహార్ తో కలిసి చేస్తున్న పూరి.. ఈ సినిమా సెట్స్ లోనే కరణ్ జోహార్ కి జనగణమన కథ వినిపించడం కరణ్ జోహార్ సూపర్ గా ఉంది.. స్క్రిప్ట్ రాయి.. పాన్ ఇండియాగా ఈ సినిమా చేద్దామని భరోసా ఇవ్వడంతోనే పూరి కరోనా లాక్ డౌన్ లో జనగణమన స్క్రిప్ట్ సిద్ధం చేసాడని అంటున్నారు. అంటే బాలీవుడ్ యంగ్ హీరోలతో ఎవరితోనైనా పూరి జనగణమన ఉంటుంది. మరి మహేష్ చేస్తే ఎంత చెయ్యకపోతే ఎంత.. టాలీవుడ్ హీరోలేనా.. నా కథకి బాలీవుడ్ హీరోలు సై అంటారంటూ పూరి ఇచ్చిన ప్రకటన చూస్తే అనిపిస్తుంది. మరి మహేష్ పూరి తో సినిమా అంటుంటే.. పూరి మాత్రం మహేష్ కి పెద్ద ఝలక్ ఇచ్చాడు. అయితే పూరి కాన్ఫిడెన్స్ మొత్తం విజయ్ సినిమా హిట్ మీదే ఉంది.. అది గనక సో సో అయ్యిందా.. మనోడు మళ్ళీ టాలీవుడ్ కే వచ్చేస్తాడంటున్నారు మహేష్ ఫాన్స్.

Tags:    

Similar News