పూరి మరో ప్లాన్ సిద్ధం చేస్తున్నాడా?

పూరి జగన్నాధ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఇచ్చిన భరోసా తో పాన్ ఇండియా మూవీ లోకి దిగాడు. మళ్ళీ ఆ సినిమాని పూరి జగన్నాధ్ ఛార్మితో కలిసి, [more]

Update: 2020-05-20 04:50 GMT

పూరి జగన్నాధ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఇచ్చిన భరోసా తో పాన్ ఇండియా మూవీ లోకి దిగాడు. మళ్ళీ ఆ సినిమాని పూరి జగన్నాధ్ ఛార్మితో కలిసి, బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ తోనూ కలిసి నిర్మిస్తున్నాడు. అయితే విజయ్ దేవరకొండ తో ఫైటర్ ని పాన్ ఇండియా గా మార్చిన పూరి కి కరోనా లాక్ డౌన్ షూటింగ్ కి అడ్డం అపడింది. ముంబై లోనే షూటింగ్ జరుపుకుంటున్న విజయ్ సినిమా ఇప్పడుడిప్పుడే మళ్ళీ షూటింగ్ ముంబైలో మొదలెట్టే పరిస్థితి లేదు. ముంబై లో కరోనా కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి కూడా. అయితే ప్రస్తుతం లాక్ డౌన్ తో ఫ్రీ అయినా మరో పాన్ ఇండియా స్కెచ్ వేస్తున్నట్లుగా ఫిలింనగర్ టాక్.

ఇప్పటికే పాన్ ఇండియా లెవల్లో ఓ భారీ స్టోరీ లైన్ రాసుకుని.. కరోనా తో హీరోలను కలవలేకపోయినా.. ఫోన్ లోనే ఓ బడా హీరోకి ఆ స్టోరీ లైన్ ని నేరేట్ చేసినట్టుగా ఓ న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. లాక్ డౌన్ ప్రకటించగానే ముంబై నుండి హైదరాబాద్ కి వచ్చేసిన పూరి జగన్నాధ్ తర్వాత ఓ స్టార్ హీరోని దృష్టిలో పెట్టుకుని పాన్ ఇండియా కథని రాసుకున్నాడట. ఆ కథని ఫోన్ లోనే కొంతమంది హీరోలకు వినిపించినట్టుగా చెబుతున్నారు. పూరి విజయ్ తో సినిమాని చుట్టేసి గ్యాప్ లేకుండా మరో సినిమా మొదలెట్టాలని ప్లాన్ చేస్తున్నాడట.

Tags:    

Similar News