పూరి బ్యాంకాక్‌కి ప్యాకప్ చేప్పేశాడా..?

Update: 2018-08-22 08:21 GMT

టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కు బ్యాంకాక్ అంటే ఎంత ప్రేమో అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే పూరీ ఏ సినిమా కథ రాయాలన్నా.. స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాయాలన్నా బ్యాంకాక్ వెళ్లి రాస్తుంటారు. ఆ విషయం పూరి డైరెక్ట్ గా చాలాసార్లు చెప్పారు. అక్కడ అతనికి సొంతంగా ఒక ఇల్లు కూడా ఉంది. ప్రతి సినిమాలో ఏదో సాంగ్ లో కానీ.. సీన్ లో కానీ బ్యాంకాక్ ఛాయలు కనపడేలా చూసుకుంటాడు. బ్యాంకాక్ అంటే పూరి జగన్నాథ్ కి అంత పిచ్చి మరి. అయన కథ రాయడానికి వారం రోజులు.. దాని తర్వాత దాన్ని బౌండ్ స్క్రిప్ట్ కంప్లీట్ చేయడానికి వారం రోజులు తీసుకుంటారు. ఇంతకు మించి ఎక్కువ సమయం కూడా తీసుకోడు. ఈ విషయాలన్నీ పూరి ఓ సందర్భంలో చెప్పారు. అటువంటి పూరి ఇప్పుడు తన స్టైల్ ని మార్చుకున్నాడు.

కలిసి రావడం లేదనుకున్నాడా..?

బ్యాంకాక్‌కి కి బై చెపేసినట్టు ఉన్నాడు. బ్యాంకాక్ కి వెళ్లకుండా పూరి ఇక్కడే హైదరాబాద్ లో నెక్స్ట్ సినిమా కోసం కథ రాస్తున్నారట. తన కొడుకు ఆకాష్ పూరితో 'మెహబూబా’ తరవాత ఇంకో సినిమా చేయడానికి పూరి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ కథను పూరి హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో పార్క్ హోటల్ లో తన కొడుకు సినిమా కథను పూర్తి చేసే పనిలో ఉన్నాడని తెలుస్తుంది. త్వరలోనే ఆ సినిమా వివరాలను వెల్లడించనున్నారు. మరి ఎందుకని పూరి ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్టో తెలియాలి. బహుశా అక్కడికి వెళ్లి కథలు రాసుకుంటే కలిసి రావడం లేదనేమో.. ఏది ఏమైనా 'మెహబూబా’తో తన మేకింగ్ స్టైల్ ని మార్చారు పూరి.

Similar News