ముంబై లో మకాం అందుకేనా?

హైదరాబాద్ లో పూరి జగన్నాధ్ నిన్నటివరకు అట్టర్ ప్లాప్ డైరెక్టర్. ఎన్టీఆర్ టెంపర్ తర్వాత పూరి కి మళ్ళీ రామ్ తో చేసిన ఇస్మార్ట్ శంకర్ హిట్ [more]

Update: 2020-01-28 08:00 GMT

హైదరాబాద్ లో పూరి జగన్నాధ్ నిన్నటివరకు అట్టర్ ప్లాప్ డైరెక్టర్. ఎన్టీఆర్ టెంపర్ తర్వాత పూరి కి మళ్ళీ రామ్ తో చేసిన ఇస్మార్ట్ శంకర్ హిట్ కొట్టేవరకు మధ్యలో నాలుగైదు సినిమాలు ప్లాప్ అయ్యాయి. అయినప్పటికీ.. హీరోయిన్ ఛార్మితో కలిసి పూరి కనెక్ట్స్ అంటూ నిర్మాణ సంస్థ పెట్టడం దానికోసం పూరి జగన్నాధ్ హైదరాబాదులో ఓ అద్భుతమైన ఆఫీస్ “కేవ్” ని ఏర్పాటు చేసుకున్నాడు. పూరి కేవ్ నుండే కథ, స్క్రిప్ట్, టెక్నీకల్ డిపార్ట్మెంట్ పనిచేసేది. అప్పట్లో పూరి కేవ్ గురించి కథలు కథలుగా మీడియాలో ప్రసారం అయ్యింది. అయితే తాజాగా పూరి జగన్నాధ్ విజయ్ దేవరకొండ సినిమా కోసం ముంబై కి మకాం మార్చాడు. ఛార్మి తో కలిసి పూరి జగన్నాధ్ ముంబై కి షిఫ్ట్ అయ్యాడు. అయితే ఫైటర్ సినిమాని పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కించడం వలన, ముంబై దర్శకనిర్మాత కరణ్ జోహార్ తో కాంటాక్ట్స్ వలన ఫైటర్ సినిమా లో చాలా భాగం ముంబై పరిసర ప్రాంతాల్లో జరగనుండడంతో పూరి ముంబై కి మకాం మార్చాడనుకున్నారు.

కానీ పూరి జగన్నాధ్ ఇకనుండి పాన్ ఇండియా ఫిలిమ్స్ కే ఫిక్స్ అయినట్లుగా వుంది పూరి వ్యవహారం. ఎందుకంటే కేవలం మకాం మాత్రమే కాదు.. ఇప్పుడు పూరి జగన్నాధ్ ముంబై అడ్డాగా ఓ కొత్త ఆఫీస్ ని ఓపెన్ చెయ్యడం హాట్ టాపిక్ గా మారింది. పూరి గతంలోనే అమితాబ్ తో బాలీవుడ్ లో హిట్ కొట్టాడు. ఇప్పుడు ఫైటర్ తో సత్తా చాటాక… రాబోయే సినిమాలను కూడా పాన్ ఇండియా ఫిలిమ్స్ గా తీసే ఆలోచనతోనే పూరి ముంబయి ఆఫీస్ కహాని అంటున్నారు. హైదరాబాద్ కేవ్ ని తలదన్నేలా పూరి ముంబై ఆఫీస్ ఉందనేది తాజా న్యూస్. పూరి జగన్నాధ్ – ఛార్మి ఆ ఆఫీస్ డిజైన్స్ దగ్గరుండి చూసుకుని కళ్ళు మిరిమిట్లు గొలిపేలా డిజైన్ చేయించుకున్నారని.. ప్రస్తుతం ముంబై లో పూరి జగన్నాధ్ ఆఫీస్ పై హాట్ హాట్ చర్చలు జరుగుతన్నాయని అంటున్నారు.

Tags:    

Similar News