ఈసారి హీరోయిన్ తో పూరి ప్రయోగం

డైరెక్టర్ పూరి జగన్నాధ్, ఎనర్జిటిక్ హీరో రామ్ కాంబినేషన్ లో తొలిసారిగా ఓ సినిమా రాబోతుంది. దీనికి ‘ఇస్మార్ట్ శంకర్’ అనే టైటిల్ ను పెట్టారు. ప్రస్తుతం [more]

Update: 2019-02-18 11:20 GMT

డైరెక్టర్ పూరి జగన్నాధ్, ఎనర్జిటిక్ హీరో రామ్ కాంబినేషన్ లో తొలిసారిగా ఓ సినిమా రాబోతుంది. దీనికి ‘ఇస్మార్ట్ శంకర్’ అనే టైటిల్ ను పెట్టారు. ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ అవ్వనుంది. ఇక ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్నారు. నిధి అగర్వాల్, నభా నటేష్ రామ్ తో స్టెప్స్ వేయనున్నారు. అయితే ఈ చిత్రం నుండి తాజా అప్ డేట్ ఏంటంటే.. ఇందులో హీరోయిన్ నభా నటేష్ క్యారెక్టర్ వినూత్నంగా ఉండబోతుందట.

వినూత్న పాత్ర రాసిన పూరి

సాధారణంగా పూరి సినిమాల్లో హీరోలకు రాసే క్యారెక్టరైజేషన్ ను ఈసారి హీరోయిన్ కి రాశాడట. ఈ పాత్ర చాలా సరదాగా కొత్తగా ఉంటుందని సమాచారం. అయితే నభా పాత్ర సినిమాలో కొద్ది సేపు మాత్రమే ఉంటుందని టాక్. ఇక ఈ చిత్రానికి ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ రాజ్ తోట సినిమాటోగ్రఫీని అందిస్తుండగా… మణిశర్మ మ్యూజిక్ అందించనున్నారు. పూరితో పాటు ఈ చిత్రాన్ని ఛార్మీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్వరలోనే ఫస్ట్ షెడ్యూల్ ను ఫినిష్ చేసి రెండో షెడ్యూల్ కు వెళ్లనుంది టీం.

Tags:    

Similar News