నిర్మాతలను ఆడుకుంటున్న అనుష్క?

అనుష్క – మాధవన్ – షాలిని పాండే కలయికలో హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కిన నిశ్శబ్దం మూవీ షూటింగ్ పూర్తయ్యి చాలా కలం గడిచింది. అయితే అనుష్క [more]

Update: 2020-04-20 08:36 GMT

అనుష్క – మాధవన్ – షాలిని పాండే కలయికలో హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కిన నిశ్శబ్దం మూవీ షూటింగ్ పూర్తయ్యి చాలా కలం గడిచింది. అయితే అనుష్క బాహుబలి, భాగమతి సినిమాల తర్వాత చాలా గ్యాప్ తో చేసిన ఈ సినిమాపై అటు ట్రేడ్ లోను ఇటు ప్రేక్షకుల్లోనూ అమితమైన ఆసక్తి ఉంది. అయితే అనుష్క నటించిన నిశ్శబ్దం మూవీ ఈపాటికి విడుదల కావాల్సి ఉంది. అయితే కరోనా మహమ్మారి వలన సినిమా విడుదల కావడం ఇప్పట్లో జరిగే పనిలా లేదు. ఇక అనుష్క కూడా నిశ్శబ్దం మూవీ మీద ఇంట్రెస్ట్ చూపించడం లేదనే టాక్ ఎప్పటినుండో వినబడుతుంది.

తాజాగా అనుష్క వలన నిశ్శబ్దం నిర్మాతలు ఇబ్బందులు పడుతున్నారట… అనుష్క నిశ్శబ్దం ని పట్టించుకోకపోయినా పర్లేదు కానీ.. మమ్మల్ని మాత్రం నిలువునా ముంచకుండా ఉంటే చాలని అంటున్నారట. ఎందుకంటే నిశ్శబ్దం మూవీ విడుదల ఆలస్యం కావడంతో.. ఆ సినిమా నిర్మాతలు నెలకి 50 లక్షల వడ్డీ కడుతున్నారట. అయితే ఇప్పుడు ప్రస్తుతం కరోనా కారణంగా విడుదల ఆలస్యమయ్యే సినిమాలకు గాలం వేసినట్టే ఓటిటి ప్లాట్ ఫార్మ్స్ లో రారాజు అమెజాన్ ప్రైమ్ వారు నిశ్శబ్దాన్ని డిజిటల్ రిలీజ్ చెయ్యడానికి నిర్మాతలకు భారీ ఆఫర్ ఇచ్చాడరట. అయితే ఆ ఫిగర్ కి నిర్మాతలు టెంప్ట్ అయ్యి.. తమ అప్పులు తీరి ఒడ్డున పడతామని భవాని సినిమా అమ్మెయ్యడానికి చూస్తే అనుష్క ససేమిరా అంటుందట. హీరోలా మన సినిమా థియేటర్స్ లోనే విడుదల కావాలి కానీ.. ఇలాంటి వాటిలో కుదరదని ఖరాఖండిగా చెప్పడంతో.. నిర్మాతలు అనుష్క ని ప్రాధేయపడుతున్నారట.

Tags:    

Similar News