నిఖిల్ పై నిర్మాత చేస్తున్న ఆరోపణలు నిజమేనా..?

ప్రస్తుతం టాలీవుడ్ హీరో నిఖిల్, నిర్మాత నట్టి కుమార్ మధ్య టైటిల్ పోరు జరుగుతున్న విషయం తెలిసిందే. తన సినిమా టైటిల్ ముద్రని నిర్మాత నత్తి కుమార్ [more]

Update: 2019-01-28 08:19 GMT

ప్రస్తుతం టాలీవుడ్ హీరో నిఖిల్, నిర్మాత నట్టి కుమార్ మధ్య టైటిల్ పోరు జరుగుతున్న విషయం తెలిసిందే. తన సినిమా టైటిల్ ముద్రని నిర్మాత నత్తి కుమార్ తమ సినిమా ముద్రగా విడుదల చేశాడంటూ నిఖిల్ ఫైరయ్యాడు. నిఖిల్ చేసిన రచ్చ వ్యాఖ్యలకు నిర్మాత నట్టి కుమార్ అగ్గి మీద గుగ్గిలం అవడమే కాదు… ఈరోజు నిఖిల్ గనక తమకి క్షమాపణ చెప్పకపోతే… నిఖిల్ భాగోతాలను బయటపెడతా అంటూ హెచ్చరికలు కూడా జారీ చేసాడు. తమ సినిమా ఐదారేళ్లు విడుదలకు నోచుకోకుండా ఆగిపోయిన సినిమా అని… నానా కష్టాలు పడి విడుదల చేస్తే.. ఆ సినిమాను నువ్వు ఆపాలని ప్రయత్నం చేస్తున్నావు.. అంటే నీది కుర్రతనమా లేదంటే తాగిన మైకమా అంటూ నట్టి కుమార్ నిఖిల్ ని చెడామడా కడిగేస్తున్నాడు.

నీ బాగోతం బయటపెడతా…

ముద్ర టైటిల్ తో జరుగుతున్న ఈ వివాదం కాస్తా నిఖిల్ మెడకు చుట్టుకునేలా కనబడుతుంది. ఎందుకంటే నిఖిల్ కూడా తీవ్ర స్థాయిలో ముద్ర టైటిల్ పై నిర్మాత నట్టి కుమార్ ని కెలికేసాడు. అసలే నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న నట్టి కుమార్ మాత్రం నిఖిల్ ని వదలనంటూ వార్నింగ్ ఇస్తున్నాడు. నిఖిల్ నా సినిమాకు తీరని నష్టం చేశాడని… ఇంకా ఎక్కువ మాట్లాడితే నిఖిల్ గోవాలో చేసిన భాగోతం ఫొటోలు తన దగ్గర ఉన్నాయని, వాటిని రిలీజ్ చేయాల్సి వస్తుందని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. అంతేకాకుండా హీరో నిఖిల్ వలన చాలామంది నిర్మాతలు నష్టపోయారని చెబుతున్నాడు. నిజంగానే నిఖిల్ ముద్ర సినిమా షూటింగ్ గత ఏడాదే కంప్లీట్ చేసుకున్నప్పటికీ.. ఇంతవరకు విడుదల తేదీలు మార్చుకుంటూ.. ఇంకా విడుదల డేట్ ప్రకటించుకోలేదు. ఈలోపు నట్టికుమార్ ముద్ర టైటిల్ వ్యవహారం తెరమీదకి వచ్చి నానా రభస జరుగుతుంది.

Tags:    

Similar News