ప్రభాస్ ప్రైవేట్ జెట్ కహాని?

ప్రభాస్ పాన్ ఇండియా స్టార్. బాలీవుడ్ స్టార్ హీరోస్ కి సమానమైన క్రేజ్ ప్రభాస్ సొంతమైంది. బాహుబలి, సాహో, రాధేశ్యాం, ఆదిపురుష్, నాగ్ అశ్విన్ మూవీ.. ఇలా [more]

Update: 2020-11-09 05:01 GMT

ప్రభాస్ పాన్ ఇండియా స్టార్. బాలీవుడ్ స్టార్ హీరోస్ కి సమానమైన క్రేజ్ ప్రభాస్ సొంతమైంది. బాహుబలి, సాహో, రాధేశ్యాం, ఆదిపురుష్, నాగ్ అశ్విన్ మూవీ.. ఇలా ప్రభాస్ అన్ని పాన్ ఇండియా మూవీస్ కే మొగ్గు చూపుతున్నాడు. అటు సంపాదన పరంగాను, ఇటు రేంజ్ పరంగాను సౌత్ ఇండియా స్టార్ హీరోలకు అందనంత ఎత్తులో ఉన్నాడు ప్రభాస్. ప్రభాస్ ప్రస్తుతం ఇటలీలో రాధేశ్యాం షూటింగ్ ముగించుకుని ముంబై లో ఆదిపురుష్ చర్చల్లో పాల్గొంటున్నాడట. అయితే కరోనా కి కంగారు అపడిన ప్రభాస్ ఓ ప్రైవేట్ జెట్ ని మైంటైన్ చేస్తున్నట్టుగా ఫిలిం నగర్ లో గుసగుసలు వినవస్తున్నాయి.

ప్రభాస్ కరోనా కారణముగా ఫ్లైట్స్ లో వెళ్లి రావడం ఎందుకు రిస్క్ అని.. తన ఎన్ఆర్ఐ ఫ్రెండ్ నుండి ఓ ప్రైవేట్ జెట్ తీసుకుని అందులోనే జర్నీ చేస్తున్నాడట. అందరి కన్నా ముందే ధైర్యంగా ఇటలీ వెళ్లి రాధేశ్యాం షూటింగ్ చెయ్యడానికి ప్రభాస్ కి ఆ ప్రైవేట్ జెట్ కారణమట. ఇక జార్జియా లో రాధేశ్యాం షూటింగ్ ముగించుకుని ప్రభాస్ ప్రైవేట్ ఫ్లైట్ లోనే హైదరాబాద్ రావడం, మళ్ళీ ముంబై కి వెళ్లి అక్కడ ఆదిపురుష్ కథ చర్చలో పాల్గొనడం చేస్తున్నాడని టాక్. తన ఫ్రెండ్ ప్రైవేట్ ఫ్లైట్ లోనే ప్రభాస్ ఎక్కడికి కావాలంటే అక్కడికి స్వేచ్ఛగా త్రిగుతున్నాడని అంటున్నాడు. 

Tags:    

Similar News