మారుతికి అన్యాయం జరిగింది...!!

Update: 2018-10-21 06:13 GMT

సుధీర్ బాబు హీరోగా నందిత హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం 'ప్రేమకథా చిత్రమ్'. ఈసినిమాకి స్టోరీ..స్క్రీన్ ప్లే..మాటలు..దర్శకత్వ పర్యవేక్షణ అన్ని మారుతినే చేసాడు. అప్పటిలో ఈచిత్రం సూపర్ హిట్ అయింది. ఇప్పుడు మళ్లీ ఆ సినిమాకు సీక్వెల్ రాబోతుంది. ప్రేమకథా చిత్రమ్ 2 గా ఈసినిమా రాబోతుంది.

సీక్వెల్ ఎలా తీస్తారు...?

అయితే మారుతీకి తెలియకుండా ఆర్పీఏ క్రియేషన్స్ పార్ట్ 2 ను తెరకెక్కిస్తున్నారు. మొదటి పార్ట్ కూడా ఆర్పీఏ క్రియేషన్స్ బ్యానర్ లోనే రూపొందింది. తనకు చెప్పకుండా ఈ సినిమాను తీస్తున్నారనేది దర్శకుడు మారుతి వాదన. మొదటి పార్ట్ ఐడియా నాది అయినప్పుడు రెండో పార్ట్ కు ఎవరినో పెట్టి ఏమి చెప్పకుండా సీక్వెల్ తీయడమేంటనేది మారుతి వాదన.

పంచాయతీ పెట్టే ఆలోచనలో.......

త్వరలోనే దానికి సంబంధించి మారుతీ సినీ పెద్దలతో ఓ పంచాయితీ పెట్టే ఆలోచనలో ఉన్నాడని తెలుస్తుంది. ఇక్కడ కొంతమంది వాదన ఏంటంటే...సినిమా అనేది ప్రొడ్యూసర్ కె సొంతం. డైరెక్టర్..రైటర్ అందులో పనిచేసే వ్యక్తులు అంతే. సో ప్రొడ్యూసర్స్ ఇష్టం వచ్చినట్టు ఆ సినిమా విషయంలో ఏదైనా చేయొచ్చు. అందులో డైరెక్టర్ కానీ రైటర్ కు కానీ ఎటువంటి సంబంధం లేదు. మారుతీ ఇది ఆలోచించాడో లేదో చూడాలి.

Similar News