ఆ సినిమా కోసం నిద్రలేని రాత్రులు గడిపా

Update: 2018-07-31 09:57 GMT

మహేష్ బాబు, బాలీవుడ్ నటి ప్రీతి జింటా తెలుగులో జంటగా నటించిన హిట్ సినిమా రాజకుమారుడు వచ్చి 19 ఏళ్లు అవుతోంది. ఈ నేపథ్యంలో అప్పటి జ్ఞాపకాలను ట్విట్టర్ వేదికగా పంచుకుంది ప్రీతి. సినిమా షూటింగ్ ప్రారంభోత్సవానికి సంబంధించిన ఓ చిత్రాన్ని పోస్ట్ చేసింది. రాజకుమారుడు వచ్చి 19 ఏళ్లు అయ్యిందంటే నమ్మలేమని, ఈ సినిమా కోసం తెలుగు నేర్చుకోవడానికి నిద్రలేని రాత్రులు గడిపినా మహేష్ తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉండేదని ఆమె చెప్పింది. ఈ చిత్రంలో తనకు అవకాశం ఇచ్చిన రాఘవేంద్రరావుకు కృతజ్ఞతలు తెలిపింది. చిత్రంలోని ఓ పాటలో మహేష్, ప్రీతి కలిసి డ్యాన్స్ చేసిన వీడియోను షేర్ చేసింది. ప్రతీ జింటా సినీ కెరీర్లో రాజకుమారుడు నాలుగో సినిమా కాగా, తెలుగులో రెండో సినిమా. అంతకుముందు ఆమె వెంటేష్ కి జోడీగా ప్రేమంటే ఇదేరా చిత్రంలో నటించింది.

 

 

 

Similar News