ఎన్టీఆర్ తో కన్ఫర్మ్ అవలేదు.. పారితోషికంపై న్యూస్?

ఎన్టీఆర్ RRR మూవీ తర్వాత త్రివిక్రమ్ తో సినిమా ని అధికారికంగా ప్రకటించాడు. హరిక హాసిని వారు, కళ్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి అయినను [more]

Update: 2020-05-21 06:21 GMT

ఎన్టీఆర్ RRR మూవీ తర్వాత త్రివిక్రమ్ తో సినిమా ని అధికారికంగా ప్రకటించాడు. హరిక హాసిని వారు, కళ్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి అయినను పోయిరావలె హస్తినకు అనే టైటిల్ ని పరిశీలిస్తుంటే.. ప్రస్తుతం త్రివిక్రమ్ ఎన్టీఆర్ స్రిప్ట్ ని ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు. అయితే త్రివిక్రమ్ సినిమా తరవాత ఎన్టీఆర్ ఎవరితో సినిమా చేస్తాడట, ఆయన 31 వ సినిమా డైరెక్టర్ పై రకరకాల పేర్లు వినిపించాయి. అయితే ఈ రోజు ఎన్టీఆర్ పుట్టిన రోజునాడు ఎన్టీఆర్ 31 వ సినిమాపై క్లారిటీ వస్తుంది అనుకున్నారు. ఎన్టీఆర్ 31 వ సినిమాని కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తోనే ఫిక్స్ అంటూ ఓ న్యూస్ ఫిల్మనగర్ లో చక్కర్లు కొడుతోంది.

ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ 31 సినిమాని మైత్రి మూవీస్ వారు నిర్మిస్తారని.. భారీ బడ్జెట్ తో ఎన్టీఆర్ మూవీని నిర్మిస్తారని, పాన్ ఇండియా లేవల్లో ఎన్టీఆర్ 31 వ సినిమా ఉండబోతుంది అని, ఈ సినిమాకి ప్రశాంత్ నీల్ పారితోషకం కూడా ఫిక్స్ అయ్యింది అని.. దాపుగా ప్రశాంత్ నీల్ పారితోషకం 17 కోట్లని, ఇప్పటికే రెండు కోట్ల అడ్వాన్స్ లు వెళ్లాయని న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా RRR తరవాత త్రివిక్రమ్ మూవీ ఆతర్వాత అంటే 2021 చివరిలో ఉండబోతుంది అని అంటున్నారు. ఇక ఈ సినిమాకి ప్రశాంత్ నీల్ రెమ్యునరేషన్ చూసాక అందరూ ఇప్పుడు ఎన్టీఆర్ కి ఎంతివ్వబోతున్నారో అంటూ హాట్ హాట్ చర్చలకు తెర లేపారు.

Tags:    

Similar News