ప్రభాస్ తో పోటీకి వస్తున్న సూర్య

బాహుబలి చిత్రంతో ప్రభాస్ మార్కెట్ బాగా పెరిగిపోయింది. ఇప్పుడు అతను చేసే సినిమా ‘సాహో’ మీద రూ.300 కోట్ల దాకా బడ్జెట్ పెడుతున్నారు. ప్రభాస్ ఒక్క భాషకే [more]

Update: 2019-03-19 10:12 GMT

బాహుబలి చిత్రంతో ప్రభాస్ మార్కెట్ బాగా పెరిగిపోయింది. ఇప్పుడు అతను చేసే సినిమా ‘సాహో’ మీద రూ.300 కోట్ల దాకా బడ్జెట్ పెడుతున్నారు. ప్రభాస్ ఒక్క భాషకే పరిమితం కాదు కాబట్టి ఈ సినిమాను దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో ఆగస్టు 15న రిలీజ్ చేయనున్నారు. బాలీవుడ్ లో కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి అక్కడి స్టార్లు కూడా భయపడే పరిస్థితి ఉంది. తమ సినిమాలను వాయిదా వేసుకుందామని చూస్తున్నారు. కానీ తమిళ స్టార్ హీరో సూర్య మాత్రం ప్రభాస్ చిత్రానికి భయపడుతున్నట్లుగా కనిపించడం లేదు.

అదే రోజు కాప్పన్ రిలీజ్

తన కొత్త సినిమా అయిన ‘కాప్పన్’ను ఆగస్టు 15నే రిలీజ్ చేయడానికి సూర్య సన్నాహాలు చేస్తున్నాడు. ఈ విషయాన్ని సూర్యనే స్వయంగా ప్రకటించాడు. ఇందులో మోహన్ లాల్, ఆర్య లాంటి భారీ తారాగణం ఉంది. తమిళంలో భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతుంది. ప్రభాస్ లాంటి హీరోకు పోటీగా ‘కాప్పన్’ను రిలీజ్ చేస్తే ఇబ్బందులు తప్పవు. మరి ఏ ధైర్యంతో సూర్య ఆ డేటును ఎంచుకున్నాడో. కొన్ని రోజులు మారిన తరువాత సూర్య తన నిర్ణయం మార్చుకుని రిలీజ్ డేట్ మారుస్తాడేమో చూద్దాం.

Tags:    

Similar News