ప్రభాస్ ఫ్యాన్స్ కు ఇది గుడ్ న్యూస్

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సాహో చిత్రం ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. అయితే ఇప్పటివరకు ఈసినిమా కు సంబంధించి సరైన ప్రమోషన్ చేయలేదు. [more]

Update: 2019-02-09 06:41 GMT

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సాహో చిత్రం ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. అయితే ఇప్పటివరకు ఈసినిమా కు సంబంధించి సరైన ప్రమోషన్ చేయలేదు. ఒక పోస్టర్ వదిలారు కానీ అందులో ప్రభాస్ మొహం కనపడదు. వర్కింగ్ వీడియో లో లాస్ట్ లో ప్రభాస్ కనిపించినా అది అంతగా ఎట్రాక్ట్ కాలేదు. సో అందుకే దర్శకనిర్మాతలు ప్రభాస్ ఫ్యాన్స్ కోసం కొన్ని పోస్టర్స్ రిలీజ్ చేయాలనీ భావిస్తున్నారు.

అందు కోసం ఒక రెండు రోజులు కేవలం పోస్టర్స్ కోసమే షూట్ చేయనున్నారు. ఆల్రెడీ ఒక రోజు ఈ షూటింగ్ జరిగిపోయింది. ఇందులో ప్రభాస్ తో పాటు హీరోయిన్ శ్రద్ధా కపూర్ కూడా పాల్గొంది. మరో రోజు కూడా షూటింగ్ జరగాల్సివుంది. ఇక ఈచిత్రాన్ని బాహుబలి రేంజ్ లో రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు.

సినిమా రిలీజ్ కి నాలుగు నెలలు ముందే నుండే ప్రమోషన్లు చేయాలనుకుంటున్నారు.. తెలుగు తో పాటు హిందీ, తమిళ్, మలయాళం భాషల్లో ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు. యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కానుంది

Tags:    

Similar News