ప్రభాస్ కు తలనొప్పిగా మారిన చిరు

Update: 2018-12-09 04:59 GMT

చిరంజీవి ప్రస్తుతం 'సైరా ' చిత్రంలో నటిస్తున్న సంగతి తెల్సిందే. ఈసినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నాడు రామ్ చరణ్. సమ్మర్ లోనే ప్రభాస్ 'సాహో' ని కూడా రిలీజ్ చేయాలి అనుకున్నారు. కానీ ప్రభాస్ చిరు కోసం వెనక్కి తగ్గి తన సినిమాను ఆగస్ట్ 15కు వాయిదా వేసుకున్నాడు. ఇప్పుడు మరో విషయంలో కూడా ప్రభాస్ కు పోటీగా నిలిచాడు చిరంజీవి.

అది కూడా శాటిలైట్ హక్కుల విషయంలో. ప్రభాస్ సినిమా 'సాహో'...చిరు 'సైరా' సినిమా రెండు ఒకే రేట్స్ చెప్పడంతో ప్రభాస్ సినిమాకి బదులు చిరంజీవి సినిమానే కొనుక్కుంటాం కదా... అని అంటున్నారట టీవీ ఛానెల్స్ వారు. దాంతో 'సాహో' మేకర్స్ కి చిరు తలనొప్పిగా మారాడు.

ప్రభాస్ 'సాహో' చిత్రానికి తెలుగు శాటిలైట్ రైట్స్ ను 25-30 కోట్ల మధ్య అమ్మాలని చూస్తున్నారు యూవీ క్రియేషన్స్ వారు. అదే రేట్ నిర్మాత రామ్ చరణ్ కూడా 'సైరా' కి చెబుతున్నాడట. దాంతో టీవీ ఛానెల్స్ అంత చిరు సినిమానే కొనుక్కోవడానికి ఇష్ట పడుతున్నారు. లేకపోతే 'సాహో' మేకర్స్ ఈచిత్రాన్ని తక్కువ రేట్ కి అమ్ముకోవాలి. 'సైరా' కు డిజిటల్ రైట్స్ కూడా అమ్మడు అయ్యాయి. ఇప్పుడు శాటిలైట్ రైట్స్ కోసం చూస్తున్నాడు చరణ్. త్వరలోనే శాటిలైట్ రైట్స్ కూడా అమ్మేయాలి అనే ఆలోచన. ఈనెలాఖరుకు ఈ సినిమాకు సంబంధించి మైసూర్ ప్యాలెస్ లో ఓ కొత్త షెడ్యూల్ మొదలవుతుంది

Similar News