మొన్న దుబాయ్.. నేడు రొమానియా!!

Update: 2018-10-21 04:00 GMT

ప్రభాస్ - సుజిత్ కాంబోలో తెరకెక్కుతున్న సాహో చిత్రం భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతుంది. బాహుబలి తర్వాత మళ్ళీ అదే భారీతనంతో సాహో చిత్రాన్ని ప్రభాస్ చేస్తున్నాడు. దేశంలోని పలు భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఖర్చు చాలా భారీగా ఉందట. ఇప్పటికే దుబాయి వంటి దేశంలో భారీగా ఖర్చు పెట్టి ఒక యాక్షన్ ఎపిసోడ్ ని చిత్రీకరించారు. కేవలం అబుదాబి యాక్షన్ ఎపిసోడ్ కే 70 కోట్ల మేర ఖర్చు పెట్టినట్లు.... ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకే హైలెట్ అనేలా ఉంటుందని అన్నారు. మరి భారీ తారాగణం ఉన్న ఈ భారీ సినిమాలో అన్ని భారీగానే ఉన్నాయి.

రొమానియాకు బయలుదేరి......

ఇక తాజాగా రాధాకృష్ణ డైరెక్షన్ లో తన 20 వ సినిమాలో కూడా ప్రభాస్ నటిస్తున్నాడు. ప్రస్తుతం రాధాకృష్ణ, సాహో చిత్రాల షూటింగ్ ని బ్యాలెన్సుడ్ గా చేస్తున్న ప్రభాస్ రాధాకృష్ణ సినిమా ఇటలీ షెడ్యూల్ పూర్తి చేసి ఇప్పుడు సుజిత్ సాహో కోసం రొమానియా బయలుదేరబోతున్నాడట. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సాహో కోసం రొమానియాలో చిత్రబృందం ఓ భారీ యాక్షన్ చేజ్‌ ను షూట్ చేయనున్నారని తెలుస్తోంది. అయితే ఈ యాక్షన్ ఎపిసోడ్ కి సంబందించిన షూట్ లో ప్రభాస్‌తో పాటు సాహో లో మెయిన్ విలన్ గా నటిస్తున్న నీల్‌ నితిన్‌ ముఖేష్‌ కూడా పాల్గొనబోతున్నాడని సమాచారం.

ప్రత్యేక ఆకర్షణగా......

ఇక ప్రభాస్ - నీల్ నితిన్ ముఖేష్ ల మధ్య జరిగే చేజ్‌ కూడా సాహో సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా చెబుతున్నారు. ఇక ఈ చిత్రంలో గ్రాఫిక్స్ తో కూడుకున్న యాక్షన్ సీక్వెన్స్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి అని మొదటి నుండి ప్రచారంలో ఉన్న మాట. మరి దుబాయ్ యాక్షన్ ఎపిసోడ్ కోసం కోట్లు ఖర్చు పెట్టిన యువీ వారు ఇపుడు రోమానియా యాక్షన్ ఎపిసోడ్ కి ఎంత ఖర్చు పెట్టబోతున్నారో అంటూ రకరకాలుగా ఊహాగానాలు మొదలైనాయి.

Similar News