ఫ్యాన్స్ బాధను అర్ధం చేసుకున్న ప్రభాస్

Update: 2018-10-20 05:42 GMT

'సాహో' చిత్రం స్టార్ట్ అయి ఏడాది పైనే అవుతుంది. కానీ ఈచిత్రానికి సంబంధించి ఒక్క అప్ డేట్ కూడా ఇవ్వట్లేదు మేకర్స్. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ నిర్మాతలపై చాలా కోపంగా ఉన్నారు. ఏడాది కిందట ప్రభాస్ బర్త్ డే రోజున ఫస్ట్ లుక్ టీజర్ అని వదిలారు. కానీ అది ఫ్యాన్స్ కు అంతగా నచ్చలేదు. ఆ తర్వాత లీకయిన ఫోటోలు తప్ప అసలు ఈసినిమాకు సంబంధించి ఒక్క అప్ డేట్ కూడా ఇవ్వలేదు మేకర్స్.

ఆత్మ హత్య చేసుకుంటున్నానంటూ.....

ఈనేపధ్యంలో ఓ ప్రభాస్ అభిమాని యూవీ క్రియేషన్స్ వారిని అప్ డేట్ ల గురించి అడిగి అడిగి విసిగి పోయి ఆత్మహత్య చేసుకుంటున్నానని లెటర్ రాసాడు. అది సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. చివరికి అది నిజం కాదని తెలిసిపోయింది. అలానే రీసెంట్ గా ప్రభాస్ అభిమానులు కొందరు యువీ క్రియేషన్స్ వారి ఆఫీసుకు వెళ్లి అక్కడ అప్ డేట్స్ విషయంలో గొడవ చేశారని సమాచారం. యువీ క్రియేషన్స్ కు వెతిరేకంగా సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు.

పుట్టిన రోజునాడు....

ఇవన్నీ గమించిన ప్రభాస్ తన ఫేస్ బుక్ ఖాతాలో అక్టోబర్ 23 న తన పుట్టినరోజునాడు అభిమానులకు ఒక స్వీట్ న్యూస్ ఇస్తానని ప్రకటించాడు. సాహో కి సంబంధించి మేకింగ్ వీడియో ఒకటి విడుదల చేయాలనీ ప్లాన్ చేస్తున్నారట.

Similar News