అందరికన్నాముందు వెళ్లనున్న పాన్ ఇండియా స్టార్!!

కరోనా తో షూటింగ్స్  మొత్తం ఐదునెలలుగా ఆగిపోయాయి. మార్చి 20 న ఆగిన షూటింగ్స్ ఇంకా మొదలు కాలేదు. ఎవరు మొదలు పెడతారో అని అందరూ ఎదురు [more]

Update: 2020-08-30 07:18 GMT

కరోనా తో షూటింగ్స్  మొత్తం ఐదునెలలుగా ఆగిపోయాయి. మార్చి 20 న ఆగిన షూటింగ్స్ ఇంకా మొదలు కాలేదు. ఎవరు మొదలు పెడతారో అని అందరూ ఎదురు చూస్తున్నారు. బడా ప్రాజెక్ట్స్ దర్శకులు, హీరోలు షూటింగ్ విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. కొంతమంది కారొనని లైట్ తీసుకుంటుంటే… కొంతమంది లెక్క చెయ్యడం లేదు. అలా బాలీవుడ్ కోలీవుడ్, మల్లువుడ్, శాండిల్ వుడ్ మొత్తం షూటింగ్స్ చెయ్యడానికి సమాయత్తమవడమే కాదు.. అందరూ సెట్స్ లోనే కనబడుతున్నారు. కానీ ఒక్క టాలీవుడ్ హీరోలే ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. మొన్నటికి మొన్న రామ్ చరణ్ షూటింగ్ కోసం బయలుదేరుతున్నాడన్నారు కానీ.. క్లారిటీ లేదు.

తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాధేశ్యాం షూటింగ్ కి ప్రిపేర్ అవుతున్నాడట. విదేశాల్లో చెయ్యాల్సిన షూటింగ్ కాస్తా ఇప్పుడూ రామోజీ ఫిలిం సిటీకి మారిన నేపథ్యంలో రాధేశ్యాం కోసం వేసిన హాస్పిటల్ సెట్ లో ప్రభాస్ రాధేశ్యాం షూటింగ్ ని తిరిగి ప్రారంభించబోతున్నారట. ఈ హాస్పిటల్ సెట్‌ లోనే ప్రభాస్ పై కొన్ని కీలక యాక్షన్ సీన్స్ ను షూట్ చేస్తారని.. అలాగే ఈ హాస్పిటల్ సీన్స్ లో ప్రభాస్ పాత్ర వెరీ ఎమోషనల్ గా ఉంటుందని తెలుస్తోంది. కరోనా ఉన్నప్పటికీ.. ప్రభుత్వ నిబంధనల మేరకు షూటింగ్ చెయ్యడానికి రాధాకృష్ణ అన్ని ప్లానింగ్స్ చేసుకున్నాడట. వచ్చేనెల 20 నుండి ఫిలిం సిటీలో రాధేశ్యాం షూటింగ్ షెడ్యూల్ మొదలుపెడతారని టాక్.

Tags:    

Similar News