ప్రభాస్ సినిమా విషయంలో కొత్త ట్విస్ట్

ప్రభాస్ సాహో తర్వాత రాధాకృష్ణ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. తాజాగా రెండో షెడ్యూల్ జరుపుకుంటున్న ప్రభాస్ సినిమా టైటిల్ విషయంలో ఎడతెగని ఉత్కంఠ సాగుతూనే [more]

Update: 2020-01-23 08:01 GMT

ప్రభాస్ సాహో తర్వాత రాధాకృష్ణ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. తాజాగా రెండో షెడ్యూల్ జరుపుకుంటున్న ప్రభాస్ సినిమా టైటిల్ విషయంలో ఎడతెగని ఉత్కంఠ సాగుతూనే ఉంది. జాన్ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ప్రభాస్ సినిమాకి ఫైనల్ గా జాన్ టైటిల్ నే సెట్ చేస్తారనే టాక్ ఉంది. ఈలోపు జాను టైటిల్ తో సమంత వచ్చెయ్యడంతో.. జాన్ టైటిల్ మీద కన్ఫ్యూజన్ ఏర్పడింది. అయినప్పటికీ రాధాకృష్ణ – ప్రభాస్ లు జాన్ టైటిల్ కే మొగ్గుచూసుపుతున్నారట. మరో పక్క ఈ సినిమా షెడ్యూల్ హైదరాబాద్ లో మూడు కోట్లతో వేసిన కాస్ట్లీ సెట్ లో షూటింగ్ జరుపుకుంటుంది.

ఆ కాస్ట్లీ సెట్ లో మొర్రాకో టైల్స్ తో వేసిన ఫ్లోరింగ్… యాంటిక్ పియానో.. ఖరీదైన కార్పెట్స్ వాడారట. అయితే ఈ సినిమా మొదటినుండి ది 70లలో పిరియాడికల్ లవ్ స్టొరీ గా ఉండబోతుంది అనే ప్రచారం జరుగుతుంది. తాజాగా దర్శకుడు రాధాకృష్ణ మాత్రం ఇది 70లలో పిరియాడికల్ లవ్ స్టొరీ కాదని… కానీ కొత్త తరహా ప్రేమకథ అంటూ ట్విస్ట్ ఇచ్చాడు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ కోసం బాలీవుడ్ నటి భాగ్యశ్రీ అమ్మ పాత్రకి దిగిందంట. ఇప్పటికే ప్రభాస్ – భగ్యశ్రీ పై తెర‌కెక్కించాల్సిన స‌న్నివేశాలు పూర్త‌యిపోయాయి అని ఆమె షూటింగ్‌కి పేక‌ప్ చెప్పేసి ముంబై కూడా వెళ్లిపోయింది అంటున్నారు. మరి పాన్ ఇండియా మూవీ అంటే.. అందులో ఖచ్చితంగా బాలీవుడ్ నటులు ఉండాల్సిందే కదా

Tags:    

Similar News