ప్రభాస్ కోసం ప్రశాంత్ నీల్ కష్టాలు!

ప్రభాస్ తో కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించబోయే సలార్ పై అప్పుడే అంచనాలు మొదలైపోయాయి. ప్రస్తుతం రాధేశ్యాం సెట్స్ మీదున్న ప్రభాస్ తర్వాత నాగ్ అశ్విన్ [more]

Update: 2020-12-07 01:20 GMT

ప్రభాస్ తో కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించబోయే సలార్ పై అప్పుడే అంచనాలు మొదలైపోయాయి. ప్రస్తుతం రాధేశ్యాం సెట్స్ మీదున్న ప్రభాస్ తర్వాత నాగ్ అశ్విన్ – ఓం రౌత్ ఆదిపురుష్ సినిమాలను ఏక కాలంలో పూర్తి చేసే ఏర్పాట్లలో ఉన్న ప్రభాస్ కి ప్రశాంత్ నీల్ ఓ రీమేక్ కథ చెప్పి ఒప్పించి అధికారిక ప్రకటన ఇప్పించాడు. ప్రశాంత్ నీల్ – ప్రభాస్ కాంబోలో సలార్ మూవీ ప్రకటన వచ్చేసింది. ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో ఫ్రెష్ స్టోరీతో సినిమా చెయ్యడం లేదు.. ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ పనిచేసేది ఓ రీమేక్ కోసం.
ప్రభాస్ ని కమిట్ చేయించిన సలార్ మూవీని ప్రశాంత్ నీల్ కన్నడ సినిమా ఉగ్రమ్‍ కి రీమేక్ గా తెరకెక్కించబోతున్నాడనే ప్రచారం ఉంది. ఆ సినిమా మస్ మసాలా కథతోనే తెరకెక్కింది. అయితే ప్రభాస్ కూడా ఇప్పుడు ఫ్రెష్ కథలతో భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్న టైంలో ఓ రీమేక్ కోసం ప్రశాంత్ నీల్ తో చేతులు కలపడం ప్రభాస్ ఫాన్స్ కి అర్ధం కాకపోయినా.. ప్రశాంత్ నీల్ దర్శకత్వం మీదున్న నమ్మకంతో సైలెంట్ గా ఉన్నారు. అయితే అమాయకమైన కుర్రాడు.. అంత మాస్ గా మాఫియా వాళ్లనే మట్టికరిపించి నాయకుడిగా ఎలా మారాడో అనేది సలార్ కథ అని ప్రశాంత్ నీల్ చెప్పాడు. అయితే కన్నడ సినిమా ఉగ్రమ్‍ ని ప్రభాస్ క్రేజ్ కి అనుగుణంగా, ప్రభాస్ ఇమేజ్ కి సరిపోయేలా.. కథని సమూలంగా మార్పులు చేర్పులు చేసాడట. ప్రభాస్ ఫ్యాన్ ఇండియా ఇమేజ్ కి సరిపోయేలా ప్రశాంత్ నీల్ ఉగ్రమ్ స్క్రిప్ట్ ని మర్చేసాడంటున్నారు.

Tags:    

Similar News