ప్రశాంత్ నీల్ – ప్రభాస్ అంతా బుస్సే !!

సోషల్ మీడియా ప్రాచుర్యం పొందాక మంచి న్యూస్ లు ఎంతగా వైరాలవుతున్నాయో చెడు న్యూస్ లు అంటే గాసిప్స్ కూడా అంతే వైరల్ అవుతున్నాయి. మంచి న్యూస్ [more]

Update: 2020-08-22 09:58 GMT

సోషల్ మీడియా ప్రాచుర్యం పొందాక మంచి న్యూస్ లు ఎంతగా వైరాలవుతున్నాయో చెడు న్యూస్ లు అంటే గాసిప్స్ కూడా అంతే వైరల్ అవుతున్నాయి. మంచి న్యూస్ అయినా గాసిప్ అయినా క్షణాల్లో ప్రపంచాన్ని చుట్టేస్తున్నాయి. అయితే కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ మూవీ పై వార్తలు రావడం .. దానిని మైత్రి మూవీస్ వారు ద్రువీకరించడంతో ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ పై అధికారిక ప్రకటన రాకపోయినా.. వాళ్ళ కాంబో మూవీ ఫిక్స్ అని అందరూ భవిస్తున్నారు. అయితే ఈలోపు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ సినిమా అంటూ ప్రచారం మొదలైంది. ఎన్టీఆర్ తర్వాత ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో మూవీ చేయబోతున్నాడని.. ప్రభాస్ — ప్రశాంత్ నీల్ కాంబో సెట్ అయినట్లే అన్నారు.

కానీ ప్రభాస్ మరో ఐదేళ్లకు సరిపడా మూవీస్ ని లైన్ లో పెట్టేసుకున్నాడు. ప్రస్తుతం రాధే శ్యాం మూవీ వచ్చే ఏడాది విడుదల చేసి.. తర్వాత నాగ్ అశ్విన్ తో మరో పాన్ ఇండియా మూవీ ప్రకటించడం, తర్వాత బాలీవుడ్ దర్శకుడు ఓం రనౌత్ తో ఆదిపురుష్ సినిమాని ప్రకటించాడు మరి నాగ్ అశ్విన్, ఓం రనౌత్ ల మూవీలు అయ్యేసరికి ఎలా లేదన్నా మరో నాలుగేళ్లు పడుతుంది. మరి ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ చాప్టర్ 2 తర్వాత ఎన్టీఆర్ మూవీ మహా అయితే మూడేళ్ళలో పూర్తి చేసేస్తాడు. మరి ప్రభాస్అసలు ప్రశాంత్ నీల్ కథ విన్నాడో.. లేదో.. అది గాసిప్పో తెలియదు కానీ.. ప్రభాస్ ఆదిపురుష్ ప్రకటనతో ప్రశాంత్ నీల్ కాంబోలో తన మూవీ లేదని స్పష్టం చేసినట్లయింది.

Tags:    

Similar News