ఆ సన్నివేశాలే హైలెట్ అట!!

ప్రభాస్ – రాధాకృష్ణ కాంబో మూవీ ఏమంటా పట్టాలెక్కిందో.. ఆ సినిమాకి అన్ని సమస్యలే. సాహో దెబ్బకి స్క్రిప్ట్ మార్చేసిన ప్రభాస్ – రాధాకృష్ణ ఎలాగోలా మల్లి [more]

Update: 2020-04-12 07:43 GMT

ప్రభాస్ – రాధాకృష్ణ కాంబో మూవీ ఏమంటా పట్టాలెక్కిందో.. ఆ సినిమాకి అన్ని సమస్యలే. సాహో దెబ్బకి స్క్రిప్ట్ మార్చేసిన ప్రభాస్ – రాధాకృష్ణ ఎలాగోలా మల్లి సెట్స్ మీదకెళ్లారు.. కానీ మల్లి కరోనా కాటేసింది. ఆఖరుకి ఆ సినిమా లుక్ ని విడుదలచెయ్యలేక యువీ వారు చేతులెత్తేసి… ఫాన్స్ కి సారి చెప్పారు. ఈ సినిమాలో లవ్ అండ్ యాక్షన్ గా తెరకెక్కుతుంది అని.. ప్రభాస్ – పూజ హెగ్డే రొమాంటిక్ సన్నివేశాలు సినిమాకే హైలెట్ అంటున్నారు. ఇప్పటికే పూజ హెగ్డే ప్రభాస్ కాంబో రొమాంటిక్ సన్నివేశాల షూట్ జరిగింది అని.. అంటున్నారు.

ఆయితే కేవలం రొమాంటిక్  సన్నివేశాలే కాకుండా  సినిమాలో హీరో హీరోయిన్స్ మధ్యన చోటుచేసుకునే ఎమోషనల్ సీన్స్ లో ప్రభాస్ నటన కన్నీళ్లు పెట్టిస్తుందని.. ఇంతకుముందు ప్రభాస్ చేసిన సినిమాలంటికన్నా… ఈ సినిమాలో ఎమోషన్స్ పీక్స్ ఉంటాయట. ప్రభాస్ – పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ, ఎమోషన్ తో కూడిన క్లైమాక్స్ బాగా కనెక్ట్ అవుతుందని చెబుతున్నారు. ప్రభాస్ డార్లింగ్ తర్వాత పూర్తి స్థాయి లవ్ ఎంటర్టైనర్ మల్లి ఈ మూవీ నే అంటున్నారు. మరి ఈ సినిమా టైటిల్ గా రాధే శ్యాం అంటూ ప్రచారం జరగడమే కానీ.. ఇంతవరకు స్పష్టత లేదు.

Tags:    

Similar News