ఫాన్స్ కోసం ప్రభాస్ వేగం పెంచాడా

Update: 2018-04-26 09:38 GMT

బాహుబలి సినిమాతో నేషనల్ వైడ్ మార్కెట్ సంపాదించుకున్న ప్రభాస్ తన నెక్స్ట్ మూవీ కూడా అదే రేంజ్ మార్కెట్ రావాలని బడ్జెట్ కూడా పెంచేసి కంప్రమైజ్ కాకుండా సినిమాను తెరకెక్కిస్తున్నాడు. 'సాహో' షూటింగ్ కోసం చాలానే గ్యాప్ తీసుకున్నాడు ప్రభాస్. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ అయ్యి రిలీజ్ చేస్తారో ఎవరికి తెలియని విషయం.

ఇంకా గ్యాప్ ఉండకూడదనే ప్రభాస్ తన నెక్స్ట్ మూవీ విషయంలో ఓ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఒక వైపున 'సాహో' సినిమా షూటింగ్ జరుగుతూ ఉండగానే, మరో వైపున కృష్ణంరాజు సొంత సినిమాను చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను జిల్ సినిమాను తీసిన రాధాకృష్ణ ప్రభాస్ ను డైరెక్ట్ చేయనున్నాడు.

ఇక ప్రభాస్ కు జోడిగా పూజా హెగ్డే కథానాయికగా నటించనుంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగును జూలై 7 నుంచి మొదలుపెట్టనున్నారు. తెలుగు తో పాటు తమిళ్ లో కూడా ఈ సినిమాను రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు. ఏదిఏమైనా ప్రభాస్ ఫ్యాన్స్ కి ఇది ఒక్క గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

Similar News