హమ్మయ్య ప్రభాస్ మరో సినిమా మొదలవుతోంది..!

Update: 2018-09-03 06:40 GMT

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ 'బాహుబలి' తర్వాత యంగ్ డైరెక్టర్ సుజీత్ డైరెక్షన్ లో ‘సాహో’ చిత్రంలో ఫుల్ బిజీగా ఉన్నాడు. లేటెస్ట్ గా ఈ సినిమా దుబాయ్ షెడ్యూల్ ను ఫినిష్ చేసుకుని ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది. యాభై శాతం కూడా కంప్లీట్ అవ్వని ఈ సినిమా రిలీజ్ ఎప్పుడో ఇంకా క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు మేకర్స్. ఇది ఇలా ఉంటే ప్రభాస్ తన నెక్స్ట్ సినిమాను లైన్ లో పెట్టుకున్నాడు.

జిల్ దర్శకుడితో...

‘సాహో’ తర్వాత ‘జిల్‌’ ఫేమ్‌ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్‌ నటించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఓపెనింగ్ సెప్టెంబర్ 6న ఉండబోతుందని సమాచారం. ఆ మేరకు జిల్ రాధాకృష్ణ తన సినిమా ప్రారంభోత్సవం కోసం ప్రిపరేషన్ లో ఉన్నారని చెబుతున్నారు. జిల్ సినిమాతో యూత్ ని ఆకట్టుకున్న ఈ దర్శకుడు ప్రభాస్ ని ఎలా డైరెక్ట్ చేస్తాడో చూడాలి. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో స్టార్ట్ అవ్వాలి కానీ 'సాహో' లేట్ అవ్వటం వల్ల రాధాకృష్ణ ఇన్నాళ్లు వేచి చూడాల్సొచ్చింది.

స్వయంగా నిర్మించనున్న కృష్ణంరాజు...

ఎట్టకేలకు సినిమాను లాంచ్ చేసేస్తున్నారు కాబట్టి 'సాహో' చిత్రీకరణ పూర్తవ్వగానే రెగ్యులర్ చిత్రీకరణ ఉంటుందని భావిస్తున్నారు. ప్రభాస్ కి జోడిగా పూజ హెగ్డే నటిస్తున్న ఈ సినిమాను యువి క్రియేషన్స్ తో కలిసి గోపి కృష్ణ మూవీస్ పతాకంపై కృష్ణంరాజు స్వయంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కొంత భాగం యూరప్ లో జరగనుంది. అయితే ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ విషయమై చిత్ర యూనిట్ ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

Similar News