ప్రభాస్ – నాగ్ అశ్విన్ స్టోరీ లైన్ అదేనా?

ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో జాన్ అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. పూజ హెగ్దే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా పిరియాడికల్ డ్రామాగా.. మెచ్యూర్డ్ [more]

Update: 2020-05-11 07:30 GMT

ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో జాన్ అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. పూజ హెగ్దే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా పిరియాడికల్ డ్రామాగా.. మెచ్యూర్డ్ అండ్ సెన్సిబుల్ లవ్ స్టోరీగా ఉండబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది. అయితే ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనే విషయం పక్కనబెడితే..  ఈసినిమా ఓపెనింగ్ ఫొటోస్ ని తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే.. ఆ ఫొటోస్ విపరీతమైన వైరక్ అయ్యాయి,. ఆ సినిమా ఇంకా పూర్తికాకుండానే ప్రభాస్ మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ తో మరో పాన్ ఇండియా మూవీకి కనెక్ట్ అయ్యాడు.

భారీ బడ్జెట్ తో భారీగా నాగ్ అశ్విన్ ప్రభాస్ ని పాన్ ఇండియా లెవల్లో ప్లాన్ చేసాడు. అయితే తాజాగా ప్రభాస్ – నాగ్ అశ్విన్ సినిమా స్టోరీ లైన్ ఇదే అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సోషల్ మీడియా కథనం ప్రకారం ఇది ఓ సోసియో ఫాంటసీ మూవీ అని తెలుస్తుంది. సామాన్య మానవుడు, దేవకన్యకు పుట్టిన ఓ వన్దర్ కిడ్ స్టోరీనే అని.. ఒకానొక చిత్రమైన పరిస్థితిలో సాధారణమైన మానవుడికి .. దేవకన్యకి జన్మించిన వాడిగా కనిపిస్తాడనేది తాజా సమాచారం. మానవుడికి .. దేవకన్యకి జన్మించిన బిడ్డ పెరిగి పెద్దయ్యాక అతను ఎలాంటి అద్భుతాలు చేస్తాడనేదే ప్రధానమైన కథాంశమని అంటున్నారు.

Tags:    

Similar News