ప్రభాస్ తో గొడవ నిజమే!!

Update: 2018-10-19 06:48 GMT

'బాహుబలి' సినిమాతో ఇండియా వైడ్ పాపులర్ అయినా ప్రభాస్ ప్రస్తుతం 'సాహూ' చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈసినిమా తర్వాత ప్రభాస్ రాధాకృష్ణ డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నాడు. తన టాలెంట్ తో...తన నటనతో ప్రేక్షకుల హృదయాలు గెలుచుకున్న కంగనా రనౌత్ ప్రస్తుతం 'మణికర్ణిక' పేరిట ఝాన్సీ లక్ష్మీ బాయి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తోంది.

వీరి మధ్య......

ప్రభాస్ - కంగనా కాంబినేషన్ వచ్చిన చిత్రం ఒకే ఒక్క చిత్రం 'ఏక్ నిరంజన్'. చాలా ఏళ్ళ కిందట రిలీజ్ అయినా ఈచిత్రాన్ని పూరి జగన్నాధ్ డైరెక్ట్ చేసాడు. ఈసినిమా షూటింగ్ సమయంలో ప్రభాస్ - కంగనా మధ్య ఏర్పడిన వివాదం, గొడవ ఏంటో తెలియదుగానీ..సమయం వచ్చినపుడల్లా ప్రభాస్ ను కంగనా దెప్పిపొడుస్తూనే ఉంది.

మాట్లాడుకోవడమే మానేశామంటూ......

రీసెంట్ గా ఆమె ఆ గొడవ గురించి ప్రస్తావిస్తూ..."ఏక్ నిరంజన్ సమయంలో మా మధ్య పెద్ద గొడవ జరిగింది. ఆపై మేమిద్దరం మాట్లాడుకోవడమే మానేశాం" అని తన ఫ్రెండ్స్ తో చెబుతుందంట. కానీ ప్రభాస్ నటించిన 'బాహుబలి' చిత్రం చూసి గర్వంగా ఫీలయ్యానని, 'మణికర్ణిక'లో తన నటన చూసి ప్రభాస్ కూడా అదే విధంగా ఫీలవుతాడని చెప్పిందట. మరి ఆ గొడవ ఏంటో మాత్రం బయటికి చెప్పడంలేదు.

Similar News