2019లో కాదు... 2020లో అంట..!

Update: 2018-12-21 10:46 GMT

ప్రభాస్ బాహుబలి విడుదలై అప్పుడే ఏడాదిన్నర పైనే అయ్యింది. బాహుబలి విడుదలకు ముందే సుజిత్ దర్శకత్వంలో సాహో సినిమాని పట్టాలెక్కించినా రెగ్యులర్ షూటింగ్ మాత్రం చాలా లేట్ గా మొదలైంది. తాజాగా సాహో చిత్రాన్ని వచ్చే ఏడాది అంటే 2019 ఆగష్టులో విడుదల చేస్తున్నట్లుగా నిర్మాతలు ప్రకటించారు. అయితే సాహో ప్రయాణం సుదీర్ఘంగా సాగడంతో.. ప్రభాస్ ఈ లోపు రాధాకృష్ణతో మరో లవ్ స్టోరీ మొదలు పెట్టేసాడు. ఇప్పటికే మొదటి షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీని 2019 చివరిలో విడుదల చేస్తామని దర్శకుడు సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు.

ఒకేసారి రెండు ఎందుకని...?

అయితే తాజాగా సాహో సినిమా ఆగష్టులో విడుదల చేస్తుంటే... వెంటనే రాధాకృష్ణ సినిమాని విడుదల చెయ్యడం ఎందుకులే అని ప్రభాస్ - రాధాకృష్ణ సినిమాని 2020 సంక్రాంతికి విడుదలకు ప్లాన్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. మరి రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న క్యూట్ లవ్ స్టోరీలో ప్రభాస్ కి జోడిగా పూజా హెగ్డే నటిస్తున్న విషయం తెలిసిందే. 2019 లో సాహో ఒకటి 2020 లో మరొక సినిమాతో ప్రభాస్ ఫాన్స్ ని ఖుషి చెయ్యబోతున్నాడన్నమాట.

Similar News