ప్రభాస్ ఫాన్స్ ఆ విషయంలో టెంక్షన్ పడుతున్నారా?

ప్రభాస్ బాహుబలి తో భారీగా క్రేజ్ సంపాదించుకుని సాహో తో చతికిల పడ్డాడు. సాహో తర్వాత పూజ హెగ్డే హీరోయిన్ గా రాధాకృష్ణ కాంబోలో రాధేశ్యాం సినిమా [more]

Update: 2020-08-01 08:18 GMT

ప్రభాస్ బాహుబలి తో భారీగా క్రేజ్ సంపాదించుకుని సాహో తో చతికిల పడ్డాడు. సాహో తర్వాత పూజ హెగ్డే హీరోయిన్ గా రాధాకృష్ణ కాంబోలో రాధేశ్యాం సినిమా చేస్తున్నాడు ప్రభాస్. బాహుబలి తర్వాత బాలీవుడ్ నటుల మీదే ఫోకస్ చేసిన ప్రభాస్ కి అక్కడి హీరోయిన్స్ అంతగా అచ్చి రావడం లేదు కానీ.. ప్రభాస్ మాత్రం బాలీవుడ్ హీరోయిన్స్ వెంటే పడుతున్నాడు. అందుకే ప్రభాస్ ఫాన్స్ ఇప్పుడు కాస్త టెంక్షన్ పడుతున్నారు. మొదటి నుండి అంటే ఏక్ నిరంజన్ అప్పటినుండి.. బాలీవుడ్ హీరోయిన్స్ ప్రభాస్ కి అచ్చి రావడం లేదు. ఏక్ నిరంజన్ లో కంగనా రనౌత్, అలాగే సాహో సినిమాలో శ్రద్ద కపూర్ కూడా అంతే అయ్యింది. ఆ సినిమాలు మరీ అట్టర్ ప్లాప్ అవడంతో.. ఇప్పుడు నాగ్ అశ్విన్ – ప్రభాస్ కాంబోపై ప్రభాస్ ఫాన్స్ కి కంగారు పుడుతుంది.

నాగ్ అశ్విన్ ప్రభాస్ మూవీ కోసం బాలీవుడ్ భామ దీపికా పాడుకోనేని తీసుకొచ్చాడు. భారీ పారితోషకం, భారీ కండిషన్స్ అయినా తగ్గలేదు. కానీ ఇప్పుడు ప్రభాస్ పాత గాయాలను వెలికి తీసిన ప్రభాస్ ఫాన్స్ కాస్త కంగారు పడుతున్నారు. దీపికా అంటే క్రేజ్ ఉన్న హీరోయిన్. కథలో బలముంటేనే కదా ఆమె ఒప్పుకునేది. అయినా ఇప్పడు కంగారు ఎందుకు నాగ్ అశ్విన్ మీదే భారం వెయ్యండి అని కొంతమంది అంటుంటే… ప్రభాస్ కి అచ్చిరాని హీరోయిన్స్ ఎందుకు.. హాయిగా సౌత్ హీరోయిన్ తో పని కానిచ్చేసే దానికి అంటున్నారు. మరి ప్రభాస్ – దీపికా కాంబో అయినా ప్రభాస్ ఫాన్స్ సెంటిమెంట్ ని బ్రేక్ చెయ్యాలి.. లేదంటే.. అప్పుడు ప్రభాస్ ఫాన్స్ రియాక్షన్ వేరుగా ఉంటుంది మరి. 

Tags:    

Similar News