ప్రభాస్ ఫాన్స్ ఊగిపోతున్నారు!!

ప్రభాస్ బాహుబలి నుండి బద్దకంగా సినిమాలు చేస్తున్నాడని చాలామంది అభిమానులు ఫీలవుతున్నారు. బాహుబలికి ఐదేళ్లు, సాహో కి రెండున్నరేళ్లు. ఇక రాధేశ్యాం అప్పుడే ఏడాదిన్నర. ఇక రాధేశ్యాం [more]

Update: 2020-10-08 05:20 GMT

ప్రభాస్ బాహుబలి నుండి బద్దకంగా సినిమాలు చేస్తున్నాడని చాలామంది అభిమానులు ఫీలవుతున్నారు. బాహుబలికి ఐదేళ్లు, సాహో కి రెండున్నరేళ్లు. ఇక రాధేశ్యాం అప్పుడే ఏడాదిన్నర. ఇక రాధేశ్యాం విషయాలు, ముచ్చట్లు పక్కనబెట్టి నాగ్ అశ్విన్, ఆదిపురుష్ మీదే ప్రభాస్ ఫోకస్ పెట్టాడని ఎప్పటినుండో ప్రచారంలో ఉన్న న్యూస్. ఎందుకంటే రాధేశ్యాం ఫస్ట్ లుక్ వదలడానికి యూవీ క్రియేషన్స్ వారు ఎంత నాన్చారో చూసాం. ఇప్పుడు తాజాగా ప్రభాస్ పుట్టిన రోజు కానుకగా రాధేశ్యాం కి సంబందించిన అప్ డేట్ లేదని మూవీ టీం చేతులెత్తేసింది. కరోనా కారణముగా ఆగిన షూటింగ్ ఇంకా మొదలు కాలేదు ఇక బర్త్ డే కి ఏం అప్ డేట్ ఇస్తామంటున్నారు. దానితో ప్రభాస్ ఫాన్స్ కి సర్రున లేచింది. 

అది నాగ్ అశ్విన్ కూడా ప్రభాస్ తో చెయ్యబోయే సినిమాకి ప్రభాస్ పుట్టిన రోజు ముందే కిర్రాక్ అప్ డేట్ అంటూ అనౌన్స్ చేసాడు. ఇక ఆదిపురుష్ కి ఒక్కొక్క సర్ప్రైజ్ రివీల్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్, విలన్ సైఫ్ ల పేర్లు, సినిమాకి కావాల్సిన అప్ డేట్ ఇస్తుంటే.. ప్రభాస్ పుట్టిన రోజునాడు హీరోయిన్ ప్రకటన ఉంటుంది అంటున్నారు. కానీ రాధేశ్యాం షూటింగ్ అంత జరిగి అంత ఫుటేజ్ పెట్టుకుని కనీసం టీజర్ ప్లాన్ కూడా చేయకపోవడంతో ప్రభాస్ ఫాన్స్ ఊగిపోతున్నారు. ఇక నిన్నగాక మొన్న RRR షూటింగ్ మొదలవుతుంది అంటూ ఆయా మేకింగ్ వీడియో వదలడమే కాదు… అక్టోబర్ 22 న భీం స్పెషల్ ఎన్టీఆర్ పాత్ర టీజర్ వదలబోతుననట్టుగా ప్రకటించారు. కానీ ప్రభాస్ రాధేశ్యాం మాత్రం ఎలాంటి ప్రకటన ఇవ్వకుండా లైట్ గా ఉంది. అంటూ ప్రభాస్ ఫాన్స్ కి పిచ్చెక్కిపోతుంది. సాహో లగే రాధేశ్యాం ని కూడా ప్లాప్ చేసేలా ఉంది టీం అంటూ రాధేశ్యాం నిర్మాతలను సోషల్ మీడియాలో ఆడుకుంటున్నారు ప్రభాస్ ఫాన్స్.

Tags:    

Similar News