ప్రభాస్ – నాగ్ అశ్విన్ ఏం చెయ్యబోతున్నారు!!

ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ తో రాధే శ్యాం మూవీ చేస్తున్నాడు. పూజ హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కుతున్న రాధేశ్యాం మూవీ ఫస్ట్ లుక్ ఈమధ్యనే విడుదలై సినిమాపై [more]

Update: 2020-07-16 04:21 GMT

ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ తో రాధే శ్యాం మూవీ చేస్తున్నాడు. పూజ హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కుతున్న రాధేశ్యాం మూవీ ఫస్ట్ లుక్ ఈమధ్యనే విడుదలై సినిమాపై అంచనాలు పెంచేసింది. అయితే ప్రభాస్ ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ దర్శకుడిగా పాన్ ఇండియా మూవీ చెయ్యబోతున్నాడు. ఈ సినిమా ఈ ఏడాదే పట్టాలెక్కల్సి ఉండగా.. కరోనా తో రాధే శ్యాం సినిమా షూటింగ్ వాయిదా పడడంతో.. నాగ్ అశ్విన్ సినిమా వచ్చే ఏడాదికి గాని పట్టాలెక్కే ఛాన్స్ లేదు. అయితే ప్రభాస్ – నాగ్ అశ్విన్ సినిమాలో బాలీవుడ్ భామ దీపికా పదుకొనేని హీరోయిన్ గా సంప్రదిస్తున్నారని.. అలాగే ఈ సినిమా సైన్స్ ఫిక్ష‌న్ బ్యాగ్డ్రాప్ లో తెరకెక్కుతోందని ప్రచారం జరుగుతుంది.

తాజాగా నాగ్ అశ్విన్ – ప్రభాస్ సినిమాపై మరో న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ రెండు పాత్రల్లో అంటే ద్విపాత్రాభినయం చేయబోతున్నాడని.. ఒకేసారి రెండు విభిన్న‌మైన కాలాల‌లో జ‌రిగే క‌థ గా ఈ సినిమా తెరకెక్కుతుంది అని… అలాగే ప్రభాస్ పోషించే ఆ రెండు పాత్ర‌లూ పురాణ పురుషుల్ని పోలి ఉంటాయ‌ని తెలుస్తోంది. అయితే నాగ్ అశ్విన్ ఈ రెండు క‌థ‌ల్ని, రెండు పాత్ర‌ల్నీ ఎలా క‌లిపాడ‌న్న‌ది ఈ సినిమాలోఆస‌క్తికరంగా ఉంటుంద‌ట. అయితే ఈ సినిమా కోసం భారీ సెట్స్ నిర్మాణం చేపట్టాలని, ఇప్పటికే నాగ్ అశ్విన్ సెట్స్ కి సంబందించిన ఆర్ట్స్ ని ఆర్ట్ దర్శకుడికి అప్పజెప్పాడని అంటున్నారు. నాగ్ అశ్విన్ కరోనా టైం ని ప్రభాస్ తో చెయ్యబోయే సినిమా కోసం వినియోగిస్తున్నాడని టాక్. 

Tags:    

Similar News