ప్రభాస్ కాస్త పట్టించుకోవయ్యా?

ప్రభాస్ కి మొహమాటమెక్కువ.. తొందరగా ఎవరితోనూ కలవడు. ఇక అతి మంచివాడంటూ చాలా ఫంక్షన్స్ లో చాలామంది ప్రముఖులు చెప్పారు. అయితే నిజంగానే ప్రభాస్ కి మొహమాటం [more]

Update: 2020-09-16 07:24 GMT

ప్రభాస్ కి మొహమాటమెక్కువ.. తొందరగా ఎవరితోనూ కలవడు. ఇక అతి మంచివాడంటూ చాలా ఫంక్షన్స్ లో చాలామంది ప్రముఖులు చెప్పారు. అయితే నిజంగానే ప్రభాస్ కి మొహమాటం ఎక్కువట. ఎదుటి వారిని తొందరగా నమ్మేసే గుణమట. అయితే ప్రభాస్ తాజాగా రాధేశ్యాం తో పాటుగా నాగ్ అశ్విన్ మూవీ అలాగే ప్రభాస్ బాలీవుడ్ లో ఓం రనౌత్ తో ఓ భారీ బడ్జెట్ మూవీ ఆదిపురుష్ సినిమా చేస్తున్నాడు. అయితే ఆదిపురుష్ విషయంలో ప్రభాస్ ఏం పట్టనట్టుగా ఉన్నాడని టాక్. మొహమాటమో మారేదన్నానో కానీ దర్శకుడు ఓం రనౌత్ ఏది చెబితే అదే ఆదిపురుష్ విషయంలో జరుగుతుందట. ప్రభాస్ పూర్తిగా ఓం రనౌత్ ని నమ్ముతున్నాడట.

ఓం రనౌత్ సినిమా మొదలెట్టేద్దాం.. ఓ షెడ్యూల్ అయ్యాక మీ మరొక సినిమాలు చేసుకోండి అని చెబితే అలాగే అన్నాడట ప్రభాస్. ఇక ఆదిపురుష్ విలన్ విషయంలోనూ ప్రభాస్ ని అడక్కుండానే ఓం రనౌత్ తన తానాజీ ఫేమ్ సైఫ్ అలీ ఖాన్ ని దింపేసాడట. తర్వాత ప్రభాస్ కి తెలిసింది. ఇక ఓం రనౌత్ విలన్ ఎంపిక కరెక్ట్ కాదని ప్రభాస్ ఫ్యాన్స్ మొత్తుకుంటున్నారు. ప్రబస్ ముందు సైఫ్ అలీ ఖాన్ తేలిపోతాడని గొడవ చేస్తున్నారు. ఇక ఓం రనౌత్ అన్ని డెసిషన్స్ తీసుకున్నాకే తర్వాత ప్రభాస్ ని ఫోన్ లో ఒప్పించేస్తున్నాడట. ఇక ఆదిపురుష్ కోసం ప్రభాస్ ప్రమేయం లేకుండా ఓం రనౌత్ బాలీవుడ్ లోనే ఒక టీం ఏర్పాటు చేసుకుంటున్నాడట. ప్రభాస్ కి ఇది చెయ్యండి బాడీ ఫిట్ గా ఉంచండి, హిందీ నేర్చుకోండి అని చెప్పి ఓం రనౌత్ ప్రభాస్ ని మిగతా విషయాల్లో ఇన్వాల్వ్ కానివ్వడం, లేదని టాక్. ఇదంతా చూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ప్రభాస్ కాస్త పట్టించుకోవయ్యా.. మొహమాటానికి పొతే సాహో విషయంలో ఏం జరిగిందో అదే జరుగుతుంది అని అంటున్నారట.

Tags:    

Similar News