బోయపాటిపై ఇండైరెక్ట్ కామెంట్స్ చేసిన పోసాని

Update: 2018-04-29 12:25 GMT

ఈనెల 20న విడుదలై సెన్సషన్స్ ని క్రియేట్ చేస్తున్న చిత్రం 'భరత్ అనే నేను'. ఈ సినిమా రోజురోజుకి బాక్స్ ఆఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేస్తూ దూసుకుపోతుంది. అటు ఓవర్సీస్ లో కూడా అదే పరిస్థితి. ముఖ్యంగా అమెరికాలో 3 మిలియన్ మార్క్ ను దాటేసింది. నిన్న రాత్రి ఈ సినిమా సక్సెస్ సెలెబ్రేషన్స్ చాలా గ్రాండ్ లెవెల్ లో జరిగింది.

ఈ కార్యక్రమానికి హీరో మహేష్ బాబు.. కొరటాల శివతో పాటు సినిమాలో నటించిన చాలా మంది ఆర్టిస్ట్స్ వచ్చారు. పోసాని కృష్ణ మురళి కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యాడు. ఈ సందర్భంగా పోసాని మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పోసాని కొరటాల గురించి మాట్లాడుతూ.." శివ నా మేనల్లుడు... మాటలు చాలా తక్కువగా ఉంటాయి మహేష్ బాబులా. చేతలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇండస్ట్రీకి వచ్చాక కొరటాల శివ చాలా సంపాదించాడు అని మీరు అనుకుంటారు కానీ ఎక్కువ పోగొట్టుకున్నాడు..వాడి కథల్ని చాలా మంది కాచేశారు. లేకపోతే ఈపాటికి పది సినిమాలు సూపర్ హిట్ కొట్టేవాడు అని ఇండైరెక్ట్ గా బోయపాటిపై కామెంట్స్ చేసాడు.

గతంలో పోసాని డైరెక్ట్ గా చాలా ఇంటర్వూస్ లో బోయపాటిపై విరుచుకుపడ్డాడు. తనని బోయపాటి శ్రీను మోసం చేసాడని అందుకే వాడు నాకు నచ్చడు అని డైరెక్ట్ గా చెప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయ్. మరోపక్క కొరటాల కూడా ఇండైరెక్ట్ గా బోయపాటి నాకు స్క్రిప్ట్స్ విషయంలో ఇంపార్టెన్స్ ఇవ్వలేదని..చాలా సినిమాల్లో నా పేరు కూడా వేయలేదని చెప్పారు. దీనిబట్టి చూస్తే పోసాని ఇండైరెక్ట్ గా బోయపాటి శ్రీనుపై కామెంట్స్ చేసినట్టు స్పష్టంగా అర్ధం అవుతుంది సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

Similar News