పాన్ ఇండియా లెవల్ అయితే పెంచాలా తల్లి!!

బాహుబలి తో అనుష్క, తమన్నా పాన్ ఇండియా లెవెల్ సినిమా చేసినా అనుష్క బరువు వలన తర్వాత తన బాహుబలి క్రేజ్ ని కాపాడుకోలేకపోతే.. తమన్నా కూడా [more]

Update: 2020-10-28 04:31 GMT

బాహుబలి తో అనుష్క, తమన్నా పాన్ ఇండియా లెవెల్ సినిమా చేసినా అనుష్క బరువు వలన తర్వాత తన బాహుబలి క్రేజ్ ని కాపాడుకోలేకపోతే.. తమన్నా కూడా బాహుబలి క్రేజ్ ని నిలబెట్టుకోలేకపోయింది. ఇక ప్రభాస్ సాహో తో బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ద కపూర్ పాన్ ఇండియా మూవీ చేసినా.. శ్రద్ద కపూర్ కి సాహో ప్లాప్ దెబ్బ మాములుగా పడలేదు. ఇక మిగిలింది… ప్రభాస్ తో రాధేశ్యాం చేస్తున్న పూజ హెగ్డే. ఈమధ్యన రాధేశ్యాం సోషల్ మీడియాలో బీట్స్ అఫ్ రాధేశ్యాం అంటూ అదరగొట్టింది. పూజ హేగ్డ్ కి పాన్ ఐడియా అప్పీల్ వచ్చేసింది. అలా వైకుంఠపురములో కన్నా ముందు భారీ హిట్ లేదు. అలా వైకుంఠపురములో బ్లాక్ బస్టర్ వడంతో పూజ రెమ్యునరేషన్ కూడా పెంచేసింది అని అన్నారు.

అఖిల్ సినిమాలో హాట్ గా నటించేందుకు బాగానే వసూలు చేసింది అంటున్నారు. అన్నట్టుగానే అఖిల్ తో మోస్ట్ బ్యాచులర్ లో పూజ హాట్ అందాలు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయి అనేది టీజర్ లో చూసాం. అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోయిన్స్ కొరత వలన స్టార్ హీరోలందరికీ పూజ హెగ్డే, లేదంటే రష్మిక లేదంటే బాలీవుడ్ హీరోయిన్స్ తప్ప వేరే ఛాయస్ లేకుండా పోయింది. అయితే నిన్నమొన్నటివరకు సౌత్ సినిమాలు, బాలీవుడ్ మూవీస్ సపరేట్ సపరేట్ గా చేసుకున్న పూజ హెగ్డే రాధేశ్యాంతో పాన్ ఇండియా లెవల్ మూవీ చేస్తుంది కాబట్టి నిన్నమొన్నటివరకు కోటి, కోటిన్నర అందుకున్న పూజ ఇప్పుడు రెండున్నర కోట్లు అడుగుతుంది. ఎమన్నా అంటే పాన్ ఇండియా క్రేజ్ ఉంది.. మీ ఇష్టం అంటుందట. పాన్ ఇండియా అయితే ఓకె.. కానీ రెండున్నర కోట్ల అంటే కష్టమంటున్న సౌత్ నిర్మాతలు పూజ హెగ్డే కి మరో ఆప్షన్ వెతుకుతున్నారట.

Tags:    

Similar News