పూజ రెడీ అంట.. కానీ హీరోలు?

కరోనా వలన సినిమా షూటింగ్స్ అన్ని ఎక్కడికక్కడ ఆగిపోయాయి. కరోనా లాక్ డౌన్ పెట్టినప్పుడు ప్రభాస్ అండ్ రాధేశ్యాం టీం అంతా జార్జియా లోనే ఉంది. అక్కడి [more]

Update: 2020-08-22 09:49 GMT

కరోనా వలన సినిమా షూటింగ్స్ అన్ని ఎక్కడికక్కడ ఆగిపోయాయి. కరోనా లాక్ డౌన్ పెట్టినప్పుడు ప్రభాస్ అండ్ రాధేశ్యాం టీం అంతా జార్జియా లోనే ఉంది. అక్కడి షెడ్యూల్ ని ముగించుకుని హైదరాబాద్ వచ్చాక 14 రోజుల పాటు హోమ్ క్వారంటైన్ లోనే గడిపింది రాధేశ్యాం టీం. ఆఖరుకి పూజ హెగ్డే కూడా తన ఇంటిలోనే హోమ్ క్వారంటైన్ లో గడిపింది. తర్వాత లాక్ డౌన్ లో పూజ హెగ్డే ఇంటి లో ఫుడ్ ప్రిపేర్ చెయ్యడం, అలాగే వర్కౌట్స్ చెయ్యడం లాంటివి చాలానే చేసింది. ఇక షూటింగ్స్ ఇదిగో అదిగో అంటున్నారు కానీ.. కరోనా వ్యాక్సిన్ వచ్చేవరకు షూటింగ్స్ జరక్కపోవచ్చు. హీరోలంతా వ్యాక్సిన్ వచ్చాకే షూటింగ్ అన్నట్టుగా ఉన్నారు.

కానీ ఇప్పుడు పూజ హెగ్డే మాత్రం లాక్ డౌన్ తో బాగా బోర్ కొట్టిందో లేదంటే కరోనా కి భయపడడం లేదో కానీ… నేను షూటింగ్స్ కి రేడి అంటుందట. నేను రెడీ మీరు రెడీ నా అంటూ సవాల్ చేస్తుందట పూజ. పూజ హెగ్డే పాన్ ఇండియా మూవీ ప్రభాస్ రాధేశ్యాం లోను, టాలీవుడ్ లో అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ లోను నటిస్తుంది. ప్రస్తుతం తాను షూటింగ్స్ కి సిద్ధంగా ఉన్నానని.. మీరు కకూడా రెడీనా అంటూ దర్శకులకు, హీరోలకు సవాల్ విసురుతుంది. మీరెప్పుడు షూటింగ్ కి రమ్మన్నా నేను రేడి అంటుందట. మరి పూజ హెగ్డే రెడీనే.. కానీ హీరోలు రెడీ కావొద్దు. 

Tags:    

Similar News